ఖుషి సినిమాలో ఐయామ్ బెంగాల్ టైగ‌ర్ - సిద్దూ సిద్దార్థ రాయ్ అంటూ రెచ్చిపోయాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఆ స‌న్నివేశాలు ఇప్ప‌టికీ అభిమానుల‌కు గుర్తే!  ఇప్పుడు సంత‌ప్‌నంది... ఆ డైలాగ్‌ని మ‌రోసారి గుర్తుచేయ‌బోతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ - సంప‌త్‌నంది క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. గబ్బ‌ర్ సింగ్‌కి సీక్వెల్ ఇది. ప్ర‌స్తుతానికి గ‌బ్బ‌ర్ సింగ్ 2 అనే పిలుస్తున్నారు.

అయితే ఈ సినిమాని బెంగాల్ టైగ‌ర్ అనే పేరు పెడితే ఎలా ఉంటుంది?  అని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. ప‌వ‌న్ కోసం సంప‌త్ ఓ క‌థ రాసుకొన్నాడు. ఆ టైటిల్ ఇదే. అయితే ఆ క‌థ ప్ర‌స్తుతానికి పక్క‌న పెట్టారు. అయితే ఆ టైటిల్‌ని ఈ సినిమా కోసం వాడుకొంటే బాగుంటుంద‌ని సంత‌ప్‌నంది అభిప్రాయం.

��

అయితే గ‌బ్బ‌ర్‌సింగ్ అనే క్రేజీ టైటిల్‌ని వ‌దులుకోవ‌డం ప‌వ‌న్‌కి ఇష్టం లేద‌ట‌. ఈ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ పేరుతోనే బ‌య‌ట‌కు రావాల‌ని అభిప్రాయ ప‌డుతున్నాడు. చూద్దాం... చివ‌రికి ఏ టైటిల్‌తో ఈ సినిమా వ‌స్తుందో..?  ఇదిలా ఉండగా ఈ చిత్రానికి కధానాయికగా ముంబై భామ సొనాక్షి సిన్హా ను సంప్రదించినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: