నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయిక క‌ష్టాలు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ సినిమాకి ఒక్క‌రూ సెట్ అవ్వ‌డం లేదు. చాలామంది పేర్లు ప‌రిశీలించారు. చివ‌రికి త్రిష‌, ఛార్మిలు క‌థానాయిక‌గా ఎంపిక‌య్యాన‌నే వార్త‌లొచ్చాయి. అయితే ఇప్పుడు త్రిష కూడా బాల‌కృష్ణ‌కు హ్యాండిచ్చింది. నేను రూల‌ర్ సినిమాలో న‌టించ‌డంలేదు.. అంటూ ట్విట్ట‌ర్‌లో సందేశం పంపింది.

మ‌రోవైపు ఛార్మి కూడా ఈ సినిమాలో లేద‌ట‌. అస‌లు ఛార్మి పేరే ప్ర‌స్తావ‌న‌కు రాలేద‌ని.. ఈ వార్త‌లెలా వ‌చ్చాయో అర్థం కావ‌డం లేద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. తాజా స‌మాచార‌మ్ ప్ర‌కారం... ఓ కొత్త‌మ్మాయిని క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌ని తెలిసింది. అయితే ఆమె ఎవ‌రో, ఎక్క‌డి అమ్మాయో చెప్ప‌డం లేదు. రెండో క‌థానాయిక కూడా ఎంపిక చేశాక‌... ఇద్ద‌రి పేర్లూ ఒకేసారి ప్ర‌క‌టిస్తార‌ట‌.

��

ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థానాయిక‌ల విష‌యంలో త‌న సూచ‌న‌లు చెప్పిన బాల‌కృష్ణ‌... ఇప్పుడు నిర్ణ‌యం పూర్తిగా బోయ‌పాటి శ్రీ‌నుకే వ‌దిలేశాడ‌ట‌. మీ ఇష్టం వ‌చ్చిన క‌థానాయికను తెచ్చుకోండి - అంటూ బాధ్య‌త ద‌ర్శ‌కుడిపైనే వేశార‌ట‌. ఈ అన్వేష‌ణ‌కు అంతు ఎప్పుడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: