మరోవైపు ఛార్మి కూడా ఈ సినిమాలో లేదట. అసలు ఛార్మి పేరే ప్రస్తావనకు రాలేదని.. ఈ వార్తలెలా వచ్చాయో అర్థం కావడం లేదని చిత్రబృందం చెబుతోంది. తాజా సమాచారమ్ ప్రకారం... ఓ కొత్తమ్మాయిని కథానాయికగా ఎంచుకొన్నారని తెలిసింది. అయితే ఆమె ఎవరో, ఎక్కడి అమ్మాయో చెప్పడం లేదు. రెండో కథానాయిక కూడా ఎంపిక చేశాక... ఇద్దరి పేర్లూ ఒకేసారి ప్రకటిస్తారట.
��
ఇప్పటి వరకూ కథానాయికల విషయంలో తన సూచనలు చెప్పిన బాలకృష్ణ... ఇప్పుడు నిర్ణయం పూర్తిగా బోయపాటి శ్రీనుకే వదిలేశాడట. మీ ఇష్టం వచ్చిన కథానాయికను తెచ్చుకోండి - అంటూ బాధ్యత దర్శకుడిపైనే వేశారట. ఈ అన్వేషణకు అంతు ఎప్పుడో చూడాలి.