ఐ యామ్ ద బెంగాళ్ టైగ‌ర్ , సిద్దు సిద్దార్ధ రాయ్....ఈ డైలాగ్ వింటే ఖుషీ సినిమా...అందులో ప‌వ‌ర్ స్టార్ యాక్షన్ సీక్వెన్స్, ఆ సినిమా బ్రేక్ చేసిన రికార్డ్స్  గుర్తోస్తాయి. ఇప్పటికీ ప‌వ‌న్ కెరీర్ లో ది బెస్ట్  అంటే ఖుషీ సినిమానే అని చెప్తుతారు చాలామంది ఫ్యాన్స్. ఆ అభిమానుల్లో ఒక‌రైనా ....ప్రస్తుతం ద‌ర్శకుడైన సంత‌ప్ నందికి కూడా ఖుషీ సినిమాలోని డైలాగ్స్ ఇష్టమట‌. అందుకే ఇపుడు త‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న  గబ్బర్ సింగ్ సీక్వెల్ కి బెంగాళ్ టైగ‌ర్ అని టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

అదేంటి గ‌బ్బర్ సింగ్ కి సీక్వెల్ అంటే గ‌బ్బర్ సింగ్ 2 అనే పెట్టాలిక‌దా అంటారా..? అస‌లు విష‌యం ఏంటంటే     గ‌బ్బర్ సింగ్ లోని క‌ధ‌, క‌ధ‌నానికి ఎటువంటి సంబంధం లేకుండా గ‌బ్బర్ సింగ్2(బెంగాళ్ టైగ‌ర్)  తీయ‌బోతున్నార‌ట‌. నిజానికి ర‌చ్చ సినిమాకు ముందే ప‌వ‌న్ కోసం సంప‌త్ నంది ఓ స్టోరి రాసుకున్నార‌ట‌. ఆ క‌ధకే కొంచెం మార్పులు చేసి సంప‌త్ నంది చెప్పడం , ప‌వ‌న్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జ‌రిగింద‌ట‌. అయితే గబ్బర్ సింగ్ లో ప‌వన్ క్యార‌క్టరైజేష‌న్ ని మాత్రం   ఈ సినిమాలోనూ  కంటిన్యూ చేస్తార‌ట‌.  గ‌బ్బర్ సింగ్ లో నాకు కొంచె తిక్క వుంది , కానీ దానికో లెక్క వుంద‌ని చెబితే...ఈ సినిమాలో    'రికార్డ్స్ నీకు కొత్త ..నాకు పాత‌. బ్రేక్ చేయ‌డం నా స‌త్తా. .... ఫాలో అవుతావు నీ బ‌తుకంతా ...అస‌లు     నే కొడితే లేకుండా పోతావు ప‌త్తా ' ఇలాంటి డైలాగ్స్ ఎన్నో ఈ సినిమాలో పెట్టార‌ట‌. డైలాగ్ చదువుతుంటేనే ప‌వ‌న్ క్యార‌క్టరేజైషన్ ఎలా వుంటుందో అర్దమైపోతుందిక‌దా..? ఇక అందులోనూ  టైటిల్ బెంగాల్ టైగ‌ర్ అని ఫిక్స్ అయ్యారంటే సినిమా ఇంకా ఏ రేంజ్ లో వుంటుందో అని ఫ్యాన్స్ భీభ‌త్సంగా అంచ‌నాలు పెంచేసుకుంటున్నారు.
��
నెక్ట్స్ మ‌న్త్ సెకండ్ వీక్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌స్తార‌ట‌. భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న ఈ సినిమాలో ప‌వ‌న్ కి జోడిగా శృతిహాస‌న్ న‌టించ‌నుంది. మొద‌ట కాజ‌ల్ , ఈ మ‌ద్య సోనాక్షి సిన్హ  హీరోయిన్ గా ఎంపిక అయిందంటూ  వార్తలు వ‌చ్చాయి . కానీ  గ‌బ్బర్ సింగ్ కి సీక్వెల్ కాబ‌ట్టి శృతినే  బెట‌ర్ ని ప‌వ‌న్ చెప్పడంతో ఆమెనే ఫైన‌లైజ్ చేసిన‌ట్టు స‌మాచారం .  మ‌రి సెట్స్ పైకి వెళ్లకుండానే హై ఎక్స్ పెక్టేష‌న్స్ క్రియేట్ చేస్తోన్న బెంగాల్ టైగ‌ర్ సంక్రాంతి బోనాంజాగా మార‌తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: