అక్కినేని కథానాయకులు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య - ముగ్గురూ సందడి చేయబోతున్నారు. మనం సినిమాలో. ఇష్క్ సినిమాతో హిట్ కొట్టిన విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. హోం బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ ఇది... అని తెలుస్తోంది. ఇప్పటికి తొలి షెడ్యూల్ పూర్తయింది.
అయితే అక్కినేనికి ఈ కథ నచ్చలేదట. విక్రమ్కు ఆయన కొన్ని సలహాలిచ్చారట. విక్రమ్ రాసుకొన్న కథ ప్రకారం ఈ సినిమాలో నాగేశ్వరరావు పక్కన ఓ కథానాయిక ఉంటుంది. ఆ పాత్ర కోసమే రేఖని సంప్రదించారు. అయితే తన పాత్రకు తానే కొన్ని కత్తిరింపులు వేసుకొన్నారు నాగేశ్వరావు. రేఖ పాత్రని ఈ సినిమాలోంచి కత్తిరించింది ఆయనేనట. అంతే కాదు... తన పాత్ర ఎలా ఉండాలి? ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అనేవాటిపై దర్శుకుడికి కొన్ని విలువైన సలహాలు ఇచ్చారట.
��
దాంతో మనం సినిమా రూపురేఖలే మారిపోయాయి. మరి అక్కినేని సలహాలు ఈ సినిమాని ముంచుతాయో, తేల్చుతాయో తేలాలంటే కొంతకాలం ఆగాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన చోటు సంపాదిస్తుందని అందరు అనుకుంటున్నారు.