కొత్త బంగారు లోకం అంటూ వరుణ్ సందేశుకి సూపర్ హిట్ మూవీ ఇచ్చి దిల్ రాజు దిల్ దోచేసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎప్పటికీ చూడలేమేమో అనే కాంబినేషనుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని తీసి అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఈ మూవీలో వెంకీమహేష్ లను అన్నదమ్ములుగా చూపించి 100 పెర్సెంట్ సక్సెస్ అయ్యాడు. 

మరి టాప్ హీరోలు ఇద్దరిని పెట్టి హిట్ సినిమా తీసిన శ్రీకాంత్ అడ్డాల తరువాత  హీరోతో సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అందులో నాగబాబు తనయుడు వరుణ్ తేని హీరోగా పరిచయం చేసే భాద్యత శ్రీకాంత్ పై పెట్టాడని తెలిసేలోపేమెగా ఫ్యామిలీ తమ డైరెక్టరుని మార్చేసింది. మరి ఇంత అవమానం జరిగిన తరువాత శ్రీకాంత్ ఎవరితో మూవీ చేస్తాడో అని ఇంకొంత ఆసక్తి కలగడం సహజం.

 ఇటువంటి టైంలోనే శ్రీకాంత్ సూపర్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఏమిటంటే శ్రీకాంత్ తానే  సొంతంగా ఓ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. అంతా కొత్త వాళ్ళతో తానే నిర్మాతగా ఓ చిన్న సినిమా తీయాలని శ్రీకాంత్ ఈ ప్రాజెక్టుని తీసి హిట్ కొట్టి  మెగా ఫ్యామిలీ ఏం మిస్ అయిందో నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. నిజంగా శ్రీకాంత్ తెసుకున్న డెసిషన్ సూపర్ కదా? ఒకవేళ ఆ మూవీ ఫట్ అయితే పరిస్థితి ఏంటి ??

మరింత సమాచారం తెలుసుకోండి: