తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో నిన్న థియేటర్లో సందడి చేశారు. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే తొమ్మిది సంవత్సరాల తర్వాత చిరంజీవి తెరపై కనిపించడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా చిరు మానియా సంతరించుకుంది. ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు..తమ అభిమాన హీరోని ఎప్పుడు చూస్తామా అని ఆతృతతో ఉన్నవారికి చిరు వన్ మాన్ షో అదరగొట్టారు.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని తనకు టికెట్ దొరకలేదనే బాధతో ఏకంగా గొంతు కోసుకున్న సంఘటన వైజాగ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని మొదటి రోజునే అందునా మార్నింగ్ షోనే చూడాలని ఆశపడిన వైజాగ్ కి చెందిన ఓ వీరాభిమానికి టికెట్ దొరక్కపోవడంతో ఆవేశంలో బ్లెడ్ తో గొంతు కోసుకున్నాడు.. ఈ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నారని అంటున్నారు. దాంతో థియేటర్ యాజమాన్యం తో పాటు మిగతా అభిమానులు కూడా షాక్ అయ్యారు .
అయితే గొంతు కోసుకొని కూడా టికెట్ అంటూ థియేటర్ వాళ్ళని అడగడం పెద్ద సంచలనం అయ్యింది. మొత్తానికి థియేటర్ యాజమాన్యం అతనికి సర్ధిచెప్పి ఆసుపత్రికి తరలించారు . చిరంజీవి సినిమా ని మొదటి రోజునే మొదటి ఆటకే చూడాలని ఇంత వెర్రిగా ప్రవర్తించాడని అంటున్నారు. నిన్న రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు .