టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ దాదాపు సక్సెస్ ని చూశాయి. నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’...అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150వ చిత్రం..దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వచ్చిన శతమానం భవతి చిత్రాలు అన్నీ సక్సెస్ లని చూశాయి. అయితే ఈ మూవీలలో ఏ మూవీ అసలైన ఘనవిజయాన్ని అందుకుందనేది ఇప్పుడు చర్ఛనీయాంశంగా మారింది.


కలెక్షన్స్ పరంగా ఎవరికి ఎక్కువ థియోటర్స్ వచ్చాయో...వారికే కలెక్షన్స్ ఎక్కువుగా వస్తాయి. ఈ లెక్క చాలా సింపుల్ గా తేలిపోతుంది. అయితే ప్రేక్షకుల మనస్సుని బాగా హత్తుకున్న మూవీ ఏది అనే విషయానికి వస్తే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 చిత్రం కేవలం కమర్షియల్ యాంగిల్ లోనే సక్సెస్ ని సాధించింది.


రైతులని ఉద్ధేశించి ఈ కథ ఉన్నప్పటికీ..ఇది కమర్షియల్ సక్సెస్ గానే నిలిచింది. ఇక బాలయ్య నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీ విషయానికి వస్తే... ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్తదనాన్ని అందించిందని తెలుస్తుంది. తెలిసితెలియని హిస్టరీని కన్నులకి కట్టినట్టు చూపించిన తీరుకి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. అలాగే సినిమాలో అమ్మకి, స్త్రీలకి ఇచ్చిన ప్రాధాన్యతకి మహిళా ప్రేక్షకులు ఎక్కువుగా కనెక్ట్ అయ్యారు.


దీంతో ఇప్పటి వరకూ బాలయ్య మూవీని చూడని కొంత మంది మహిళా ప్రేక్షకులు సైతం ఇప్పుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీని చూడటానికి వచ్చారు. దీంతో ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరయ్యారు. అలాగే శర్వానంద్‌ నటించిన శతామానం భవతి చిత్రం సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొత్తంగా చూసుకుంటే...సంక్రాంతికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న హీరోలలో బాలయ్య మూవీనే అందరిని ఆకట్టుకుందని టాలీవుడ్ నుండి అందుతున్న క్లియర్ రిపోర్ట్స్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: