తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా రాణించి తర్వాత హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు.  గతంలో చిరంజీవి కూడా విలన్ గా నటించిన వారే..ఈయన తర్వాత శ్రీకాంత్, రాజశేఖర్,రవితేజ, గోపిచంద్ లాంటి ఎంతో మంది ఉన్నారు.  ప్రముఖ దర్శకులు టి. కృష్ణ వారసుడిగా మొదటి సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని గోపిచంద్ తర్వత జయం,నిజం,వర్షం లాంటి సినిమాల్లో విలన్ గా నటించి హీరో తో సమానంగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత హీరోగా రాణిస్తూ వచ్చారు. తాజాగా హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నేడు నాలుగో షెడ్యూల్ ను ప్రారంభించుకోనుంది.

శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నాలుగో షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సంపత్ నంది మార్క్ పవర్ ఫుల్ టైటిల్ తోపాటు గోపీచంద్ స్టైలిష్ లుక్ ను కూడా త్వరలో విడుదల చేస్తాం. అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మా బ్యానర్ విలువను పెంచే విధంగా ఉంటుంది. ఇకపోతే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అంటున్నారు చిత్ర నిర్మాతలు  జె.భగవాన్-జె.పుల్లారావు.

గోపీచంద్, హన్సిక మొత్వాని, కేతరీన్, నికితీన్ ధీర్, తనికెళ్ళభరణి, ముఖేష్ రుషి, అజయ్, సచిన్ కేద్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, కెమెరా: ఎస్.సౌందర్ రాజన్, బ్యానర్: శ్రీ బాలాజీ సినీ మీడియా, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది


మరింత సమాచారం తెలుసుకోండి: