అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు ఊరట లభించింది. రాజస్థాన్ అటవీశాఖ ఆయుధ చట్టం కింద సల్మాన్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణల అనంతరం జోధ్పూర్ కోర్టు సల్మాన్ను నిర్దోషిగా పేర్కొంటూ నేడు తీర్పును వెలువరించింది.
అభిమానుల జనసంద్రం మధ్య సల్మాన్ తన లీగల్ టీంతో పాటు సోదరి అల్విరా అగ్నిహోత్రి తో కలిసి నేడు జోద్పూర్ కోర్టుకు చేరుకున్నారు. నేరారోపణలు రుజువైతే సల్మాన్కు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా సాక్ష్యాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైన కారణంగా కోర్టు సల్మాన్ను నిర్దోషిగా పేర్కొంది. కోర్టు తీర్పుపై అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.