అదేంటి షార్ట్ ఫిల్మ్ ఛాన్స్ కోసం హీరోయిన్ వేశ్యగా మారడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా. అయితే మీరు చదివింది నిజమే కాని అది నిజంగా కాదు కేవలం సినిమా కోసమే.. ఏంటి ఈ కన్ ఫ్యూజన్ అని అనుకోవచ్చు. అయితే వివరాల్లోకి వెళితే.. కబాలిలో సూపర్ స్టార్ రజిని కూతురుగా నటించిన ధన్సిక ఓ షార్ట్ ఫిల్మ్ కోసం ఏకంగా వేశ్యగా మారింది. అదేనండి వేశ్య పాత్ర చేసేందుకు కూడా సిద్ధపడింది. కబాలి లాంటి పెద్ద సినిమాలో నటించి మళ్లీ ఆమె షార్ట్ ఫిలింస్ చేయడం ఏంటని అనుకోవచ్చు.. 'సినం' అనే షార్ట్ ఫిల్మ్ లో నటిస్తుంది ధన్సిక.


ఆమెతో పాటు బెంగాలి నటి బిట్టా బోగ్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తుంది. ఆనంద్ మూర్తి డైరెక్ట్ చేస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఓ వేశ్యకు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కు జరిగే సంఘర్షణగా తీస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ మొత్తం కలకత్తా బ్యాక్ డ్రాప్ తో సాగుతుందట. బిడితా అనే పాత్రలో ధన్సిక నటిస్తుంది. మరి కబాలి లాంటి మంచి సినిమాలో నటించిన ధన్సిక పెద్ద సినిమాల అవకాశాలు వస్తున్నా సరే ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏరికోరి నటిస్తుందట. 


కెరియర్ లో ఇలాంటి క్యారక్టర్స్ చేస్తేనే మంచి కిక్ వస్తుందని అనుకుందో ఏమో కాని ధన్సిక తీసుకున్న ఈ నిర్ణయానికి అందరు అవాక్కవుతున్నారు. కబాలిలో రజిని కూతురిగా మంచి అభినయం కనబరిచిన ధన్సికకు హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తున్నాయట. మొత్తానికి ధన్సిక చేస్తున్న ఈ పాత్ర తనకు ఎలాంటి గుర్తింపు తీసుకువస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: