టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన రెండు భారీ చిత్రాల మధ్య పెద్ద పోటీనే నడిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’...అలాగే నందమూరి నటసింహం బాల‌కృష్ణ‌ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల మధ్య ఈ పోటీ నెలకొంది. అయితే ఈ రెండు చిత్రాలు పండుగ సందర్భంగా రిలీజ్ అయి మంచి సక్సెస్ ని చూశాయి. కలెక్షన్స్ పరంగానూ ఈ రెండు చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.


చాలా మంది ఈ రెండు చిత్రాల్లో గెలుపు ఒకరిదే ఉంటుంది అని అనుకున్నారు. కానీ అందరి అంచనాలకి భిన్నంగా ఇద్దరికీ భారీ సక్సెస్ రావటంతో....ఇప్పుడు ఎవరు టాప్ అనేది కొంత కన్ఫూజన్ లో పడింది. దీంతో మెగా కాంపౌండ్‌ నుండి సంక్రాంతి హీరో ఎవరు అనేదానిపై ఓ క్లారిటీ న్యూస్ ని ఇవ్వనున్నారు. దీనికి చరణ్‌ రంగం సిద్ధం చేశాడనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వాటి వివరాలను చూస్తే...మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నంబర్ 150’తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు.


అయితే కలెక్షన్స్ విషయంలో కొంత క్లారిటీ రానుంది. తొమ్మిదేళ్ళ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా చిరంజీవి స్టామినా బ్లాక్సాపీస్ వద్ద ఏ మాత్రం తగ్గలేదనేది ఈ మూవీని చూస్తే తెలుస్తుంది. అయితే మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఇప్పుడు కలెక్షన్స్ ఎంత వచ్చాయి అన్నదానిపై అంతటా హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళును ఇది రాబట్టింది. అయితే బాలయ్య మూవీ కంటే ‘ఖైదీ నంబర్ 150’ భారీ కలెక్షన్స్ ని రాబట్టగలిగిందని అంటున్నారు.


ఈ విషయాన్ని స్వయంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అధికారింగా చెప్పనున్నారు. కలెక్షన్స్ విషయంలో రకరకాల నెంబర్స్ వినిపిస్తూ ఉండడంతో రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించి...సంక్రాంతికి టాప్ లేపిన సినిమా ‘ఖైదీ నంబర్ 150’ అని తెలియజేయనున్నారు. ఇప్పటి వరకూ ఏ మూవీకి నిర్మాతలు అఫిషియల్‌ గా కలెక్షన్స్ వివరాలను చెప్పలేదు. కానీ ఇప్పుడు షడన్ గా చరణ్‌ ఈ కలెక్షన్స్ వివరాలను చెప్పటం వెనుక...బాలయ్య మూవీపై పై చేయి మెగాహీరోలదే అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: