అతను బాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్..కానీ తాను చేసిన సిగ్గుమాలిన పనికి ఇప్పడు తలపట్టుకునే పరిస్థితి వచ్చింది.  టాప్‌హీరో షారూఖ్‌ఖాన్‌ హీరోగా నటించిన 'దిల్‌వాలే', 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'రా.వన్‌' సినిమాలను రూపొందించి, బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న కరీమ్‌ మురానీనిపై హైదరాబాద్‌ పోలీసులు నిర్భయ కేసు నమోదుచేశారు. సినీ నిర్మాత కరీమ్ తనపై ముంబయి, హైదరాబాద్‌లో పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సంచలనాత్మక 2జీ కుంభకోణంలో కరీమ్ మురానీ నిందితుడిగా ఉన్నాడు.
Image result for కరీమ్‌ మురానీ
అదేవిధంగా స్రెక్ట్రం స్కాం అనుబంధ కేసుల్లో అరెస్టయిన ఇతను ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.సదరు నిర్మాత 2015 నుంచి తనక పరిచయం ఉందని ఆ యువతి తెలిపింది. ముంబయిలో (2015) కరీం మత్తు మందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఆ సమయంలోనే న్యూడ్ ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.
Image result for karim-morani
తనకు మాఫియాతో సంబంధాలున్నాయని, ఈ విషయం బయటికి చెబితే చంపేస్తానని కరీం మురానీ బెదిరించేవాడని బాధితురాలు తెలిపింది.  బాధిత యువతి ముంబైకి చెందిన విద్యార్థిని అని, సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న క్రమంలో నిర్మాత కరీం పరిచయం అయ్యాడని పోలీసులు పేర్కొన్నారు.
Image result for karim-morani
'దిల్‌వాలే'లో ఆమె జూనియర్‌ ఆర్టిస్టుగానూ పనిచేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం హయత్‌నగర్ పోలీసులు నిర్మాత కరీం మురానీపై నిర్భయ చట్టం, మరో మూడు కేసులు నమోదు చేశామని హయత్‌నగర్ పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: