బాలీవుడ్ లో సీనియర్ నటుడు రిషి కపూర్ "ఖుల్లాం.. ఖుల్లా" అనే పేరుతో తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకం ఇప్పుడు బాలీవుడ్ లో పెను సంచలనాలకు నాంది పలుకుతుంది. ఈ పుస్తకంలో తన గురించే కాకుండా తన తండ్రి రాజ్ కపూర్ గురించి..ఆయన రాసలీలలు, ఆయనకు హీరోయిన్లతో ఉన్న సంబంధం బాంధవ్యాలను విపులీకరించారు. అంతే కాకుండా తనకు సంబంధించిన కొన్ని సీక్రెట్ విషయాలు కూడా బహిర్గతం చేశారు. బాలీవుడ్ లో అందాల భామ టీనా మునిమ్ తో తనకు ఎఫైర్ ఉందని పుకార్లు వచ్చాయి.
అప్పట్లో మీడియ ఇంత ఫాస్ట్ గా లేకపోవడం..ప్రింట్ మీడియాలో వచ్చిన న్యూస్ చూసి చాలా మంది అపార్థం చేసుకున్నారని ముఖ్యంగా టీనా మునిమ్ తో సంజయ్ దత్ అంటే ఇష్టపడేదని..కానీ ఈ ఎఫైర్ల గురించి తెలుసుకున్న సంజయ్ .. గుల్షన్ గ్రోవర్తో కలిసి తనతో గొడవపడటానికి నీతూ ఇంటికి సంజయ్ దత్ వచ్చాడని పేర్కొన్నారు. అప్పటికి తనకింకా పెళ్లి కాలేదని... అయితే, ఇద్దరి మధ్య గొడవ జరగకుండా నీతూ పరిష్కారం చేసిందని తెలిపారు. మొత్తానికి తనకూ, టీనా కు ఎలాంటి ఎఫైర్ లేదని కేవలం కో స్టార్ కావడం వల్ల సన్నిహితంగా ఉంటున్నామని ఈ విషయాన్ని అప్పట్లో తప్పుగా చూపించి ప్రింట్ మీడియా చేసిన రాద్దాంతం అని సంజయ్కు నీతూ వివరించిందని గుర్తు చేసుకున్నారు.
అంతటితో ఆ వివాదం సమసిపోయిందని చెప్పారు. ఆ తర్వాత నీతూను తాను వివాహం చేసుకున్నానని... తమ పెళ్లికి సంజయ్ దత్తో పాటు హీరోయిన్లు అందరూ వచ్చారని తెలిపారు. ళ్లయిన తర్వాత డింపుల్ కపాడియాతో తనకు ఎఫైర్ ఉందని పుకార్లు వచ్చాయని రిషి కపూర్ పుస్తకంలో రాశారు. తనపై నీతూకు నమ్మకముందని, ఈ విషయం గురించి ఆమె ఆందోళన చెందలేదని తెలిపారు. డింపుల్ తనకు స్నేహితురాలు మాత్రమేనని పేర్కొన్నారు.