‘ఖైదీ నెంబర్ 150’ సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి ఆ సక్సస్ సంతోషాన్ని తన మెగా ఫ్యామిలీ సభ్యులందరితో పంచుకోవడానికి రెండు రోజుల క్రితం చిరంజీవి తన ఇంటిలో ఒక డిన్నర్ మీట్ ను ఏర్పాటు చేసినట్లు గాసిప్పుల హడావిడి జరుగుతోంది.  ఈ డిన్నర్ మీట్ కు పవన్ తన అన్నను అభినందించడానికి చిరంజీవి ఇంటికి రావడమే కాకుండా కొన్ని గంటల పాటు పవన్ చిరంజీవి ఇంట్లో కాలం గడిపాడని ఫిలింనగర్ లో వార్తలు హోరెత్తి పోతున్నాయి. 
 
అయితే ఈ విషయం వాస్తవంగా జరిగిందా లేదంటే మెగా కుటుంబం అంతా ఒకటే అని చెప్పడానికి బలం చేకూర్చే విధంగా ఇటువంటి లీకులు ఇస్తున్నారా అనే కోణంలో ఇప్పుడు ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. 'సినిమా ఫంక్షన్లకు రాలేకపోయినా మేం తరచూ కలుస్తూనే వుంటాం. చరణ్‌  పవన్‌కళ్యాణ్‌తో ఎప్పటికప్పుడు కలుస్తూనే వుంటాడు. పవన్‌ కూడా ఇంటికి వస్తుంటాడు. పబ్లిక్‌లోకి రావాలంటే పెద్దగా ఇష్టపడడు. చిన్నప్పటినుంచీ అంతే.' అంటూ 'ఖైదీ' ప్రమోషన్స్‌లో చిరంజీవి అన్న మాటలకు బలం చేకూర్చే విధంగా ఇలాంటి లీకులు ఇస్తున్నారా ? అనే అనుమానాలు కూడ కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

కేవలం 8 రోజులలో 80 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ‘ఖైదీ’ మారిన నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించిన థాంక్స్ గివింగ్ మీట్ ను అతిత్వరలో హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు.  అయితే ఆ మీట్ కు పవన్ వస్తాడా ? రాడా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఇలాంటి లీకులను మెగా కాంపౌండ్ ఇస్తూ చిరంజీవి పవన్ లు ‘ఒకటే’ అన్న సంకేతాలు మెగా కాంపౌండ్ ఇస్తోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఏది ఎలా చూసుకున్నా ప్రస్తుతం పవన్ చిరంజీవి ఇంటికి వెళ్ళాడు అన్న న్యూస్ హాట్ న్యూస్ గా మారింది.  అందుకే కాబోలు నాగబాబు ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ పై వార్తలు వ్రాయకుండా సెటైర్లు వేయకుండా ఎవరికీ రోజు గడవదు అంటూ హాట్ కామెంట్ చేసాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: