ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సాయి మాధవ్ బుర్రా పేరు  మారు మ్రోగిపోతోంది సంక్రాంతి సినిమాలు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ‘ఖైదీ నంబర్ 150’ కోసం ఈ డైలాగ్ రైటర్  రాసిన మాటలు తూటాలులా పేలడంతో చిరు బాలయ్యల సినిమాలకు సాయి మాధవ్  అదిరిపోయే సంభాషణలు ఇచ్చాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో ప్రస్తుతం సాయి మాధవ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. 

ఈపరిస్థితుల నేపధ్యంలో పవన్ నుండి సాయి మాధవ్ కు పిలుపు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ‘కాటమరాయుడు’ లోని కొన్ని సీన్స్ కు సాయి మాధవ్ చేత సంభాషణలు వ్రాస్తున్నాడని టాక్. 

అయితే ఇప్పటికే ఈసినిమా షూటింగ్ చాలావరకు పూర్తి అయిన నేపధ్యంలో పవన్ షూటింగ్ అయిపోయిన సీన్స్ కోసం రీ షూట్ చేయడానికి సాయి మాధవ్ చేత ఈ డైలాగ్స్ వ్రాస్తున్నాడా ? లేదంటే ఇంకా షూటింగ్ కాకుండా మిగిలిపోయిన సీన్స్ కోసం సాయి మాధవ్ ను రంగంలోకి దింపాడా అనే విషయం పై రకరకాల విభిన్నమైన వార్తలు వస్తున్నాయి.  అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా షూటింగ్ చాల వరకు పూర్తి అయినా పవన్ ఈసినిమా సంభాషణల విషయంలో మాత్రం పూర్తిగా సంతృప్తిగా లేదని టాక్.

దీనితో కొన్ని ఎమోషనల్ సీన్లలో సాయిమాధవ్ చేత సంభాషణలు వ్రాయిస్తే ‘కాటమరాయుడు’ కు అన్ని విధాలా బాగుంటుందని పవన్ భావించి ప్రస్తుతం సాయి మాధవ్ చేత ఈ ప్రయోగం చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  గతంలో సాయి మాధవ్ ‘గోపాల గోపాల’ తో పాటు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు కూడ మాటలు వ్రాసిన నేపధ్యం తెలిసిందే. అయితే కథలో దమ్ము లేకుండా కేవలం సాయి మాధవ్ డైలాగ్స్ మాత్రమే ‘కాటమరాయుడు’ ని రక్షిస్తాయి అనుకోవడం ఎంతవరకు కరక్ట్ అన్నది అ సినిమా విడుదలైన తరువాత మాత్రమే తెలుస్తుంది



మరింత సమాచారం తెలుసుకోండి: