‘ఖైదీ నెంబర్ 150’ అనూహ్య విజయం సాధించడంతో ఈ సూపర్ సక్సస్ కు ఆనందంతో మెగా కాంపౌండ్ పొంగిపోతున్న విషయం తెలిసిందే. ఈసినిమా సక్సస్ కు కృతజ్ఞతలు తెలిపే విధంగా ఒక భారీ థాంక్స్ గివింగ్ మీట్ ను రాబోతున్న వారంలో నిర్వహించి ‘ఖైదీ’ విజయోత్సవ సంబరాలకు ఘనమైన ముగింపు ఇవ్వాలని ఆలోచనలు చేస్తోంది. 

అయితే మెగా కుటుంబ ఫంక్షన్స్ ఎప్పుడు జరిగినా ఆ ఫంక్షన్ చుట్టూ పవన్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారుతున్న నేపధ్యంలో ఈసారి ఈ విషయానికి చరమ గీతం పాడాలని మెగా కాంపౌండ్ ఇప్పటి నుంచే గట్టి హోమ్ వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అల్లు అర్జున్ ద్వారా పవన్ అభిమానులను టార్గెట్ చేసుకుంటూ వచ్చిన మెగా కాంపౌండ్ ఈసారి పవన్ విషయంలో డైరెక్ట్ గా ఎటాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫిలింనగర్ గాసిప్.

ఇప్పటికే పవన్ విషయంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో ‘ప్రతి ఫంక్షన్ కు పవన్ రావాలా ? రాకపోతే అది నేరమా ?’ అంటూ చిరంజీవి కొంత విరక్తితో కామెంట్ చేసిన నేపధ్యం తెలిసిందే. దీనితో ఈసారి త్వరలో జరగబోతున్న థాంక్స్ గివింగ్ మీట్ లో చిరంజీవి పవన్ పై తన మాటలకు మరింత పదును పెట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

అయితే ఈ విషయాలు అన్నీ ప్రస్తుతానికి ఊహలకు మాత్రమే పరిమితం అవుతున్నా ఇలాంటి గాసిప్పులు రావడానికి ఒక కారణం ఉంది. ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అనుకోని మెరుపులు మెరిపిస్తూ నాగబాబు రామ్ గోపాల్ వర్మ – యండమూరి లపై విరుచుకుపడిన నేపధ్యంలో ఇప్పుడు కూడ అటువంటి సంచలనాలు ఉంటాయి అన్న ఊహలతో ఇలాంటి గాసిప్పులను పుట్టిస్తున్నారు అనుకోవాలి. 

అయితే ఇలాంటి సున్నిత విషయాల పై తన కెరియర్ లో ఎప్పుడూ దూకుడుగా ప్రవర్తించని చిరంజీవి తన తమ్ముడు పవన్ పై ఇలాంటి సాహసాలు చేయడు అని టాలీవుడ్ వర్గాల భావన..   


మరింత సమాచారం తెలుసుకోండి: