పైకి అన్నదమ్ముళ్ళ వలే ఉన్నా లోపల ఒకరి పై ఒకరు కారాలు, మిరియాలు నూరుకోవడం సినీ పరిశ్రమలో చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇటువంటి వాతావరణం సినిమా ఇండస్ట్రీ లోనూ, సినిమా పీపుల్స్ లోనూ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకు ఉదాహరణ చెప్పాలంటే రీసెంటుగా జరిగిన ప్రేమ కథా చిత్రమ్ ప్లాటినం డిస్క్ ఫంక్షనే తీసుకోవచ్చు.


ఇండస్ట్రీ జనాలకు ఏమైనా ప్రొబ్లెమ్స్ ఉంటే తీర్చడానికి ఈ మద్యనే ఫిలిమ్ ఛాంబరుకు ఎన్నికైన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి ముందు వంగి వంగి మరి ప్రణామాలు చేస్తుంటాడు. అదే దాసరి లేకపోతె ఆ ఈవెంటులో తనకంటే గొప్పవాడు లేడనే ఫీలింగ్స్ ఇస్తుంటాడు. తాజాగా జరిగిన ప్రేమకథా చిత్రమ్ వేడుక లో తమ్మారెడ్డి తీరు ఇలానే ఉంది. డైరెక్టర్ మారుతిని కాకా పట్టేందుకు తమ్మారెడ్డి, మారుతి పై ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన దాసరిని టార్గెట్ చేస్తూ మాట్లాడి అందిరికి ఆశ్చర్యం కలిగించాడు.


దీని కోసం ఓ పిట్ట కథ కూడా అల్లేసాడు తమ్మారెడ్డి. ఆ రోజు ఉదయమే ఓ అమ్మాయి సుసైడ్ చేసుకుందామని అనుకుని ప్రేమ కథా చిత్రమ్ సినిమా చూసి ఆగిపోయిందట. మారుతి సినిమాల్లో వల్గారిటి ఉన్నా దాని వెనుక ఓ మెసేజ్ ఉంటుంది. ఆయన సక్సెస్సుని ఓర్వలేని కొందరు ఆ వల్గారిటిని చూస్తూ బూతు అంటున్నారు తప్ప మెసేజుని అర్ధం చేసుకోలేక పోతున్నారు అంటూ దాసరిపై డైరెక్ట్ గానే కౌంటర్ వేసాడు.

అన్నట్లు మారుతికి, తమ్మారెడ్డికి మద్య మంచి సంబంధం ఉందిలెండి. అది ఎంత అంటే ఈరోజుల్లో సినిమాలో కథ చెప్పేంత. అదీకాక ఇప్పుడు ఇండస్ట్రీలో పదవులు వెలగ పెట్టాలంటే పాత వారిపై పంచ్ లేస్తూ, కొత్త వారిని అందలం ఎక్కించాలని తమ్మారెడ్డి ప్లాన్ అయుండవచ్చు. ఏమో మరి ఎక్కడ చూసినా రాజకీయమేగా నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: