ఉత్తరాఖండ్ వరద బాధితులకు సహాయం అందించే విషయంలో కూడా హీరోల ఫ్యాన్స్ గొడవలు పడుతున్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ చాలా గుప్తంగా చేసిన 24 లాక్స్ సాయం బయటికి వచ్చేయడంతో ఈ రచ్చ మొదలైయింది. పవనుకి తెలియకుండా అతని టీంలోని ఎవరో ఈ విషయం లీక్ చేసారు. ఆ తరువాత కొందరు టాలీవుడ్ హీరోలు పవన్ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నట్లుగా పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.


ముఖ్యంగా పవనే ఒక్కడే కాకుండా మహేష్, ఎన్టీఆర్ సైతం ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారిని డైరెక్టుగా ఆదుకోక పోయినా డబ్బు రూపంలో ఎంతో కొంత సహాయం అందించే ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చారు. ఇందుకు వారిని అభినందించాల్సింది పోయి, మీ హీరో ఇంతే, మా హీరో అంత ఇచ్చాడు అంటూ గొడవలు పడటం నిజంగా నీచ స్థితి.


ఎవరు ఎంత ఇచినా కష్టాల్లో ఉన్నవారికి మేము ఉన్నాం అంటూ ముందుకు వచ్చి భరోసా ఇస్తున్న వారంతా అభినందనీయులే. అది హీరోలైనా, రాజకీయ నాయకులైనా, సామాన్య మానవుడైనా! ఎవరైనా వారికి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలా కాకుండా ఇందులో కూడా ఎవరెక్కువ అని ఆలోచించే వారు, వాళ్ళు ఆ హీరోల ఫ్యాన్స్ అని చెప్పుకోవడం కూడా సిగ్గు చేటు.

మరింత సమాచారం తెలుసుకోండి: