మెగాహీరో రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ మూవీ సక్సెస్ ని సాధించటంతో రామ్ చరణ్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తన అప్ కమింగ్ మూవీ విషయంలో రామ్ చరణ్...స్టార్ డైరెక్టర్ క్రిష్ సలహాని పాటిస్తున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...ఇండస్ట్రీ లో వినిపిస్తున్న ప్రధానమైన సమాచారం ప్రకారం... రామ్ చరణ్ తన ధ్రువ మూవీ తరువాత సరికొత్త కథలని ఎంచుకోనున్నాడు. ఖాకీ సెంటిమెంట్ కి రామ్ చరణ్ కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా తను పోలీస్ తరహా కథనే ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో చరణ్ స్పై ఏజెంట్ గా తన నెక్ట్స్ మూవీలో కనిపించబోతున్నాడట.
అయితే చరణ్ తన నెక్స్ట్ సినిమా స్పై ఏజెంట్ కథగా ఉంటుందని చెప్పటానికి ప్రధాన కారణం డైరెక్టర్ క్రిష్ అని అంటున్నారు. ఎందుకంటే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు క్రిష్...ఇప్పుడు రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషనల్లో స్పై ఏజెంట్ గా ఓ కథని చరణ్ కి చెప్పాడంట.
ఒకవేళ తన కథ నచ్చకపోయినా...చరణ్ బాడీకి స్పై ఏజెంట్ కథ పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారంట. దీంతో ప్రస్తుతం క్రిష్ ఫుల్ ఫాంలో ఉన్నాడు కాబట్టి...తను చెప్పిన స్పై ఏజెంట్ కథనే రామ్ చరణ్ ఫైనల్ చేసినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం చేస్తున్న సుకుమార్ సినిమా తరువాత ఈ సినిమా ఉండనుందని అంటున్నారు.