తెలుగు ఇండస్ట్రీలో తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చారు. మొదటి నుంచి ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే మాస్, కామెడీ,మెసేజ్ తో చిరంజీవి దుమ్ముదులిపారు. ఈ నెల 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ వన్ కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగిస్తుంది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం సరికొత్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం 12 రోజుల్లోనే 85 కోట్ల షేర్ ని రాబట్టి శ్రీమంతుడు రికార్డ్ ని బద్దలు కొట్టాడు చిరంజీవి .
లాంగ్ రన్ లో బాహుబలి ని టచ్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో భారీ రికార్డులు స్థాపించిన చిత్రాలు బాహుబలి, శ్రీమంతుడు అయితే ఇప్పుడు మహేష్ నటించిన శ్రీమంతుడు రికార్డులు బద్దలు చేసింది ‘ఖైదీ నెంబర్ 150’ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించిన చిరు 200 కోట్ల దిశగా దూసుకుపోతున్నాడు.
తెలుగులో ఇప్పుడు టాప్ 2 చిత్రాల్లో నెంబర్ వన్ గా బాహుబలి ఉండగా రెండో స్థానంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం స్థానం సంపాదించుకుంది. ఇక చిరంజీవి లేట్ గా వచ్చినా లేటెస్ట్ వచ్చాడని..బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన ఎప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే ఉన్నారని మెగా అభిమానలు తెగ సంబరపడిపోతున్నారు. 150 కోట్ల గ్రాస్ ని 85 కోట్లకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించిన చిరు దృష్టి ఇప్పుడు బాహుబలి పై ఉంది .