క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఎంట‌ర్ అయి, టాలీవ‌డ్‌కు బ్లాక్‌బ‌స్టర్ హిట్‌ను ఇచ్చిన క్రేజీ డైరెక్టర్, హ‌రీష్ శంక‌ర్‌. ప‌వ‌న్‌క‌ళ్యాన్‌ను డైరెక్ట్ చేసి ఏకంగా టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో రామ‌య్యా..వ‌స్తావ‌య్యా..మూవీను డైరెక్ట్ చేసే ప‌నిలో ఉంటే, ఇంతలోనే త‌న త‌రువాత మూవీ ఏ హీరోతో చేయాలో డిసైడ్ చేసుకున్నాడు.

మ‌ళ్ళీ మెగా హీరో స్టైలిష్ స్టార్‌తో జోడి క‌డుతున్నాడు. అల్లు అర్జున్‌,హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ ఓ మూవీ రూపొందబోతుంది. ప్రస్తుతం వారి వారి మూవీల్లో ఈ ఇద్దరూ బిజిగా ఉన్నారు. అల్లుఅర్జున్ రేసుగుర్రం మూవీను పూర్తిచేసుకున్న త‌రువాత‌, హ‌రీష్ శంక‌ర్‌తో మూవీ చేస్తాడు.

ఈ లోపు ఎన్టీఆర్ మూవీను ఫినిష్ చేసుకొని అల్లుఅర్జున్ మూవీకు రంగం సిద్దం చేసుకుంటాడు. ఈ సంవ‌త్సం చివ‌రికి వీరిద్దరి మూవీ ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ మూవీకు ఇంకా కాస్టింగ్ ఎంపిక జ‌ర‌గ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: