ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం అంటే దర్శకుడు క్రిష్ అని చెప్పాల్సిందే. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసిన విధానం తనని టాలీవుడ్ టాప్ డైరక్టర్ సరసన చేర్చింది. అయితే ఈ సినిమా ఆడియోలో ఖబడ్దార్ అన్న మాట మెగా ఫ్యాన్స్ తో వచ్చిన సమస్య తెలిసిందే. ఇక ఆ విషయం క్రిష్ మళ్ళీ తను ప్రమోషన్స్ లో క్లియరన్స్ ఇచ్చేశాడు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం క్రిష్ మాటలు నచ్చలేదు.

 

క్రిష్ క్లారిటీ ఇవ్వడానికి కారణం తన తర్వాత సినిమా మెగా కాంపౌండ్ హీరోలతో ఉండటమే అని తెలుస్తుంది.  వేదంతో అల్లు అర్జున్, కంచె సినిమాతో వరుణ్ తేజ్ తో పనిచేసిన క్రిష్ అసలైతే రాయబారి సినిమా చేయాల్సింది. శాతకర్ణి కోసం రాయబారిని ఆపేసిన క్రిష్ మరోసారి ఆ కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. మరి వరుణ్ తేజ్ తోనే రాయబారి సినిమా చేస్తాడా అంటే.. కాదు ఈసారి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా అని అంటున్నారు.

 

కంచె ఆడియో అప్పుడే క్రిష్ తో సినిమా అంటే కచ్చితంగా చేస్తానని సభాముఖంగానే చెప్పాడు రాం చరణ్. కాని ఆ కాంబినేషన్ సినిమా రాలేదు. ధ్రువ సక్సెస్ తో మంచి మేకోవర్ సాధించిన చెర్రి ఇప్పుడు ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. అందుకే సుకుమార్ సినిమాతో పాటుగా క్రిష్ రాయబారిని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మరి చరణ్ ప్రాజెక్ట్ ఓకే అయితే కనుక క్రిష్ ఇక స్టార్ డైరక్టర్ అయినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: