తన కెరీర్లో తొలి హిట్టు కొట్టడానికి సుశాంత్ తెగ కష్టపడుతున్నాడు. కాళిదాసు, కరెంటు చిత్రాలు షాక్ ఇవ్వడంతో, రెండేళ్ల పాటు సినిమాల్లేకుండా గడిపాడు సుశాంత్. ఇప్పుడు అడ్డాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఆదివారం హైదరాబాద్లో విడుదలయ్యాడు. ఈ వేడుకలో.. పాప్ స్టార్ లెవిల్లో.. డాన్సులు చేశాడు సుశాంత్. సుశాంత్ తాపత్రయం జనాలకు అర్థమైనా.. ఇప్పుడిదంతా అవసరమా?? అని కౌంటర్లు వేసుకొన్నారు.
నాగ్ మాత్రం సుశాంత్కి ఉత్సాహం అందించాడు. ''నేను కూడా మాస్ సినిమా పాటల వేడుకలో ఇలానే స్టెప్పులేశా. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు సుశాంత్ అడ్డా కూడా ఆడుతుంది..'' అని సెంటిమెంటల్గా మాట్లాడాడు. ఈ వేడకపై సుశాంత్ ఒక్కడే కాదు. శాన్వి, శ్వేతా భరద్వాజ్లు కూడా లైవ్ షో ఇచ్చారు. శ్వేతా అయితే హాట్ హాట్గా కనిపించింది.
��
రెండేళ్ల పాటు ఖాళీగా కూర్చుంటే, సినిమాలు మానేశావా?? అని సుశాంత్ని చాలామంది అడిగారట. ఆ కసితో, కోపంతో... అడ్డా సినిమా చేశాడట. ఈ సినిమా గ్యారెంటీగా సూపర్హిట్టు అని సుశాంత్ ధీమాగా చెబుతున్నాడు.