తడాఖా తో హిట్ కొట్టి... నాగార్జున బెంగ తీర్చేశాడు నాగచైతన్య. ఇప్పుడు నాగ్... సిసింద్రీ అఖిల్పై దృష్టి పెట్టాడు. జోష్ లా తప్పటడుగు వేయకుండా అఖిల్కి గ్యారెంటీ హిట్టిచ్చే సినిమా ఇవ్వాలని.. తండ్రిగా తాపత్రయ పడుతున్నాడు. అందుకు సంబంధించిన గత రెండు నెలలుగా తీవ్రమైన కసరత్తుల్లో ఉన్నాడు నాగ్. అందుకే.. వచ్చే యేడాది తప్పకుండా అఖిల్ సినిమా విడుదల అవుతుందని.. నాగ్ ధీమాగా చెబుతున్నాడు.
అడ్డా పాటల వేడుకలో నాగ్ మాట్లాడుతూ.. ''మొన్న గ్రీకువీరుడు ఆడియోకి వచ్చారు, నిన్న.. తడాఖా ఆడియోకి వచ్చారు. ఈరోజు అడ్డా వేడుకకు వచ్చారు. వచ్చే యేడాది.. అఖిల్ ఆడియో వేడుకకు వస్తారు..'' అని హింట్ ఇచ్చేశాడు. అంటే.. అఖిల్ సినిమా 2014లో విడుదల అవుతుందనే కదా.. అర్థం.
��
దీన్ని బట్టి చూస్తే... నాగ్ దర్శకుడిని, కథనీ, కన్ఫామ్ చేసినట్టు అర్థం అవుతోంది. ఓ సీనియర్ డైరెక్టర్ చేతిలో సిసింద్రీని పెట్టాడని టాలీవుడ్ టాక్. మరి ఆ దర్శకుడు ఎవరో.. తెలియాలంటే కొంతకాలం ఆగాలి.