మహేష్ అభిమానులకు శుభవార్త టాలీవుడ్ ప్రిన్స్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య మహేష్బాబు-క్రిష్ కాంబినేషన్లో వస్తుందనుకొన్న శివం వెనక్కి వెళ్ళీందనే వార్తలు వచ్చాయి. అసలు శివం ఉంటుందా? ఉండదా? అనే చర్చ కూడా వచ్చింది. కృష్ణం వందే జగద్గురుమ్ కమర్షియల్గా ఆడకపోవడంతో శివం సినిమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే శివం ఉంటుందట. ఈయేడాది అక్టోబరులో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారట. ఈ మాటలు సోనాక్షి సిన్హా చెప్పడం తో మరింత బలపడింది.
సోనాక్షి ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ”త్వరలో తెలుగులో శివం అనే సినిమాలో నటిస్తున్నా. వచ్చే యేడాది వరకూ నా కాల్షీట్లు లేవు. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోంది. క్రిష్ చెప్పిన కథ నాకు నచ్చే ఈ సినిమా ఒప్పుకొన్నా..” అంటోంది. ఒక వైపు ‘ఆగడు’, మరొక వైపు ‘శివం’ సినిమాలతో ప్రిన్స్ మహేష్ వచ్చే సంవత్సరానికి తన ప్లాన్ రెడీ పెట్టుకున్నాడనే అనుకోవాలి....