సినిమా ఇండస్ట్రీలో కి చెందిన చాలా మంది తమ ఇంట్లో కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచుకోవడం అలవాటు.  సెలబ్రెటీల ఇళ్లలో సాధుజంతువులను, పక్షులను పెంచుకోవడం ఫ్యాషన్.  అప్పుడప్పుడు వాటితో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి తెగ సంబరపడిపోతుంటారు.  తాజాగా కన్నడ  హీరోయిన్ తన పెంపుడు కుక్కను కాపాడబోయిన తాను కుక్కల దాడికి బలైంది.  వివరాల్లోకి వెళితే బాలీవుడ్ నటి పారుల్ యాదవ్  ముంబై లోని జోగేశ్వర్ రోడ్ లో తన పెంపుడు కుక్క ని తీసుకొని వాకింగ్ వెళ్లింది.

ఈ సమయంలో అక్కడే తిరుగుతున్న విధి కుక్కలు పారుల్ కుక్కపైదాడి చేశాయి..దీంతో తన కుక్కను తప్పించేందుకు వాటిపై దాడిచేయగా..ఆ కుక్కల గుంపు కాస్త కుక్క ని పక్కన పెట్టేసి పారుల్ పై దాడి చేసాయి . కుక్కల దాడిలో పారుల్ యాదవ్ కు తల , చేతులు , కాళ్ళ భాగాలలో గాయాలు అయ్యాయి.  

ఈ సంఘటనతో పరూల్ భయపడిపోయింది..వెంటనే స్థానికులు ఆ కుక్కలను తరిమి  తీవ్ర గాయాలతో పరుల్ యాదవ్ ని ఆసుపత్రి కి తీసుకు వెళ్లారు.  వెంటనే అక్కడ చికిత్స చేయగా చావు తప్పినంత పనైంది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పారుల్ యాదవ్ పట్ల పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: