దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లే కథానాయకులకు అంతగా కలసిరాదుగానీ, భామలు మాత్రం బాగానే సెటిలైపోతున్నారు. అసిన్ నుంచి ఇలియానా నుంచి దక్షిణాదికి వెళ్లి పాగా వేసిన వారే. అయితే త్రిష, ప్రియమణి, ఛార్మిలాంటి వాళ్లకు కలసి రాలేదు. త్రిష ఇక ప్రయత్నించడం మానేసింది. కానీ ప్రియమణి, ఛార్మిలు మాత్రం దండయాత్ర చేస్తూనే ఉన్నారు.
బుడ్డా హోగయా తేరా బాప్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఛార్మి. ఆ సినిమా కమర్షియల్గా ఆడినా ఛార్మికి కలసి రాలేదు. జిల్లా ఘజియాబాద్లో నాయికగా చేసింది. అదీ తుస్సుమంది. దాంతో ఛార్మి క్లిక్ కాలేదు. ఇప్పుడు ఓ ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశం దక్కించుకొంది. ఇక ప్రియమణి కూడా అంతే. మణిరత్నం సినిమాతో తన లక్ పరీక్షించుకొంది. రక్తచరిత్ర కూడా డింకీ కొట్టింది. ఇక అక్కడి నుంచి పిలుపు రాదు అని డిసైడ్ అయిపోయిన తరుణంలో చెన్నై ఎక్స్ప్రెస్లో షారుఖ్తో ప్రత్యేక గీతంలో నర్తించే ఛాన్స్ వచ్చింది.
��
నిజానికి ఇవి రెండూ వీళ్లకు గోల్డెన్ ఛాన్సులే. అక్కడ అంతమంది డాన్సింగ్ స్టార్లు ఉండగా ఏరికోరి దక్షిణాది తారలనే ఎంచుకోవడం వీరి అదృష్టం. ఛార్మి, ప్రియమణి ఇద్దరూ మంచి డాన్సర్లే. కనీసం ఈ రకంగానైనా బాలీవుడ్ని మెప్పిస్తే, అంతకంటే కావల్సింది ఏముంది?