బాలీవుడ్ న‌టి సోన‌మ్‌క‌పూర్ ప‌బ్లిక్‌గా అంద‌రి ముందు కంట నీరు పెట్టుకుంది. బాలీవుడ్ మూవీ బాగ్ మిఖా బాగ్ ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్బంగా ఈ ఎమోష‌న‌ల్ సీన్ జ‌రిగింది. అక్కడ ఉన్న వారంత సోన‌మ్ ఎందుకు ఏడ్చిందో అర్దం కాలేదు.

ఇండియ‌న్ అథెలెట్ మిఖా సింగ్ నేప‌థ్యంలో బాగ్ మిఖా బాగ్ మూవీ రిలీజ్‌కు సిద్దమైంది. ట్రైల‌ర్ లాంచ్ కోసం సోన‌మ్‌క‌పూర్‌ని గెస్ట్‌గా పిలిచారు. ఆ స‌మ‌యంలో ఏదో చూడ‌కూడ‌ని స‌న్నివేశాన్ని చూసిందో, లోప‌ల బాధ ఒక్కసారిగా పొంగుకొని వ‌చ్చిందో అర్దం కాలేదు. సోన‌మ్ క‌పూర్ ఒక్కసారిగా ఏడ్చింది. ప్రొడ్యూస‌ర్ ఓంప్రక‌ష్‌ మెహ్రా సోన‌మ్‌ను వేదిక‌పైకి పిలిచిన త‌రువాత మైకుతో మాట్లాడ‌లేక‌పోయింది.

కారణం ఏంట‌ని రోపోర్టర్లు అడిగితే సోన‌మ్‌క‌పూర్‌ క‌వ‌ర్ చేసుకోలేక పోయింది. రిపోర్టర్లు సోన‌మ్‌ను ఇంకా ఇబ్బంది పెడుతుంటే, హీరో ఫ‌రాన్ అక్తర్ క‌లుగ‌జేసుకొని టాపిక్‌ను డైవ‌ర్ట్ చేశాడు. సోన‌మ్ కంట‌నీరు వెనుక అస‌లు క‌థేంటో ఎవ‌రికి అంతుప‌ట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: