ఎట్టకేలకు తడాఖాతో హిట్ కొట్టాడు... నాగచైతన్య. ఇక మాస్ హీరోగా ఎదిగిపోయినట్టే అన్నారు. అవకాశాలు రావడం ఖాయం.. అని అక్కినేని ఫ్యాన్స్ చంకలు గుద్దుకొన్నారు. అయితే ఇప్పుడేం జరిగింది? తడాఖా వల్ల చైతూ ఖాతాలో ఒక్క సినిమా కూడా చేరలేదు. మనం, హలో బ్రదర్ ఇది వరకు ఒప్పుకొన్న సినిమాలే.
కొత్తగా చైతూ దగ్గరకు నిర్మాతలెవ్వరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైతూకి ముందు నుంచీ ఎవరిదో ఒకరిది బ్యాకప్ ఉంటూ వచ్చింది. ప్రతి విజయంలోనూ ఎవరో ఒకరు వాటాకొచ్చారు. ఏమాయ చేశావెలో క్రెడిట్ అంతా గౌతమ్మీనన్, సమంతలు పట్టుకెళ్లిపోయాడు. 100%లవ్ పూర్తిగా సుకుమార్ సినిమా. తమన్నా అందచందాలకు ఎక్కువ మార్కులు పడ్డాయి.
��
ఇప్పుడు తడాఖా కూడా సోలోగా ఇరగదీసిందేం లేదు. సునీల్ వాటా కూడా ఉంది. పతాక సన్నివేశాల్లో సునీల్ నటన... ఈ సినిమాలో ఓహైలెట్గా నిలిచింది. దాంతో.. చైతూ సోలోగా ఏం చేయలేడేమో అనే భయం నిర్మాతల్లో కలుగుతోంది. ఒకవేళ మనం బాగా ఆడితే అందులో ముగ్గురు హీరోలుంటారు. అందుకే చైతూ ఏం చేసినా హలో బ్రదర్లోనే చేయాలి. సోలోగా హిట్టు కొట్టగలను అని నిరూపించుకోవాలంటే హలోబ్రదర్ని ఒంటిచేత్తో గట్టెక్కించాలి. మరి అది జరుగుతుందా??