రామ్‌చ‌ర‌ణ్ ఎవ‌డు మూవీ ఆడియో లాంచ్ ఈ నెల‌ 30న జ‌రుగుతుంది. ఎవ‌డు ఆడియోలాంచ్‌పై ర‌క‌ర‌కాల న్యూస్‌లు వినిపిస్తున్నాయి. ఈ ఫంక్షన్‌లోనే జంజీర్ మూవీ ట్రైల‌ర్స్‌ను రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని రామ్‌చ‌ర‌ణ్‌ స‌న్నిహితులు చెబుతున్నారు. ఎవ‌డు ఆడియో వేడుక ఎప్పుడో జ‌ర‌గాల్సి ఉండ‌గా, ఈ మూవీకి సంబంధించిన కొన్ని సాంగ్ షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న టైంకు ఫినిష్ కాక‌పోవ‌డంతో ఈ ఆల‌స్యం జ‌రిగింద‌ని అంటున్నారు.

ఈ నెల ముప్పై ఆడియో వేడుక జ‌రిగితే, జులై 25న మూవీను రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. ఒకే వేధికపై ఎవ‌డు ఆడియో ప్రమోష‌న్‌,జంజీర్ ట్రైల‌ర్ ప్రమోష‌న్ జ‌రుగుతుండ‌టంతో అభిమానులు ఆనందోత్సాహంలో ఉన్నారు. ఎవ‌డులో అల్లుఅర్జున్‌కూడ ప్రత్యేక పాత్రలో క‌నిపిస్తున్నాడు. అల్లుఅర్జున్‌కి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ కాసేపు క‌నిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: