ఎట్ ప్రెజెంట్ శ్రుతిహాస‌న్ చేతిలో రెండే రెండు మూవీలు రీలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇది హిందీ చిత్రాల జాబితా. తెలుగులో అయిదు మూవీలు చేస్తుంది. బ‌లుపు,ఎవ‌డు రిలీజ్‌కు సిద్దంగా ఉంటే, ఎన్టీఆర్‌తో రామ‌య్యా..వ‌స్తావ‌య్యా, అల్లుఅర్జున్ రేసుగుర్రం, అంతేకాకుండా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌,సంప‌త్ నంది మూవి. ఈ విధంగా ప్రస్తుతం శ్రుతి బిజిబిజిగానే ఉంది. త‌న చేతిలో ఉన్న మూవీలు త‌రువాత తెలుగులో చేయ‌టానికి ఏ మూవీకు సైన్ చేయ‌టం లేదు.

శ్రుతి హిందీ మూవీల‌ను చేయ‌టానికే ఎక్కువుగా ఇంట్రెస్ట్ చూసిస్తుంది. రీసెంట్‌గా ఎటెండ్ అయిన ఓ పార్టీలో ఈ బ్యూటీ త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్పింది. నేను ఎక్కువుగా హిందీ మూవీలు చేయ‌టానికి రెడీగా ఉన్నాను, నా ద‌క్కర‌కు చాల‌నే స్క్రిప్ట్‌లు వ‌స్తున్నాయి. అందులోంచి ఓ నాలుగు మూవీల‌కు సైన్ చేయ‌టానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పింది.

అయితే ఏ హీరోల‌తో త‌ను క‌మిట్‌మెంట్ ఇచ్చిందో ఇంకా తెలీయ‌దు. ఆ డిటైల్స్‌ను త్వర‌లోనే బ‌య‌ట‌కు చెబుతాన‌ని చెప్పుకొచ్చింది. ఇదే విష‌యాన్ని ఓ బాలీవుడ్ టెలివిజ‌న్‌లోనూ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: