నిన్నటి వరకూ భారీ బడ్జెట్ సినిమాలు, మల్టి స్టారర్ సినిమాలు తీసిన వారే స్టార్ డైరెక్టర్స్ గా టాలీవుడ్ లో చలామణి అవుతూ వచ్చారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఒక సినిమా డైరెక్టర్ విషయంలో మటుకూ అన్వయించడంలేదు. అతడు ఎవరో కాదు ప్రస్తుతం యూత్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న మారుతి. డబల్ మీనింగ్ డైలాగ్ లతో పూర్తి యూత్ మసాలా తో ఇతడు తీస్తున్న సినిమాలను ప్రస్తుత యువతరం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా పోస్టర్ పై ఇతడి పేరు ఉంటే చాలు ఆ సినిమాకు హై ఓపెనింగ్స్ వచ్చేస్తున్నాయి. నిర్మాతలకు కాసులు కురుస్తున్నాయి.

ఇటీవల విడుదల అయిన “ప్రేమ కధాచిత్రమ్” విజయంతో ఇతగాడి క్రేజ్ టాలీవుడ్ లో మరింత పెరిగిపోయింది. టాలీవుడ్ లోని మెగా కుటుంబాల ఫైల్యూర్ హీరోలకు ప్రస్తుతం ఇతడు చుక్కాని గా మారాడు. అల్లు వారి కుటుంబం నుంచి వచ్చిన శిరీష్ సినిమాను దర్శకత్వం వహిస్తున్న మారుతి పై అక్కినేని కుటుంబంలోని ఫైల్యూర్ హీరోల కన్నుపడిందట. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన గత కొన్ని సంవత్సరాలుగా హిట్ లేక బాధపడుతున్న సుమంత్ అలాగే “అడ్డా” తో ఇరగదిద్దామని ప్రయత్నిస్తున్న సుశాంత్, వీరిద్దరు కూడా మారుతి దర్శకత్వం లో సినిమా చేయడానికి ఉత్సాహం చుపెడుతున్నారట.

 అంతేకాదు ప్రస్తుతం మారుతి రేంజ్ పెరిగి, దాసరి అందుబాటులో లేకపోవడంతో చిన్న సినిమాల ఆడియో వేడుకలకు అతిధిగా రావడం, దాసరి మాదిరిగా కొందరిపై సెటైర్లు వేయడం, చూస్తూ ఉంటే మారుతి చిన్న దాసరి గా మారాడని ఫిల్మ్ నగర్ లో జోక్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ అక్కినేని కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు ఫైల్యూర్ హీరోలలో ఏ హీరోతో మారుతి తన సినిమాను తిస్తాడో అనే ఆశక్తి ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలలో ఉంది.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: