హీరో రామ్ చరణ్ ముంబాయ్ లో 12 కోట్ల విలువ చేసే బంగ్లా కొన్నాడు అని మీడియా లో వార్తలు వచ్చాయి. దీనితో ఫిల్మ్ నగర్ లో టాలీవుడ్ హీరో చెర్రీ ముంబాయ్ లో ఇల్లు ఎందుకు కొనుక్కున్నాడు..? అంటూ చర్చ మొదలు అయింది. అంతేకాదు ఈ మెగా పవర్ స్టార్ టాలీవుడ్ వదిలివేసి బాలీవుడ్ కు వెళ్ళిపోతాడా..? అంటూ కూడా రకరకాల ఉహాగానాలు వచ్చాయి. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం బొంబాయి లో అంత ఖరీదైన ఫ్లాట్ కొనాలి అన్న ఆలోచన చెర్రీ భార్య ఉపాసన దట.

కామినేని వారి అమ్మాయిగా మంచి బిజినెస్ మైండ్ ఉన్న ఉపాసన అపోలో హాస్పిటల్స్ కు సిఈఓ. వారసత్వ౦గా వచ్చిన మంచి వ్యాపార దృక్పధంతో ఉపాసన ఎప్పుడూ తను నిర్వహించే బిజినెస్ లో ఎప్పుడూ వెరైటీగా ఆలోచిస్తూ ఉంటుందట. ఉపాసన కు అపోలో ఫిట్ నెస్ సెంటర్ పేరుతో ముంబాయ్ లో ఒక సంస్థ ను నెలకొల్పాలి అన్నది ఆమె ఆలోచన అట.  ఈ సమయంలో తరచూ చెర్రీ కూడా “జంజీర్” సినిమా కోసం ముంబాయ్ వెళ్ళిన ఉపాసన కు అక్కడ ఒక ఇల్లు తీసుకొని తన వ్యాపార కార్యకలాపాలకు అనువుగా మార్చుకుంటే బాగుంటుందనే ఆలోచన రావడం, వెంటనే ఆక్కడే ఒక ఇల్లు కొనేయడం జరిగింది అని అంటున్నారు. అంతే కాకుండా రామ్ చరణ్ కు కూడా బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్న నేపధ్యంలో ముంబాయ్ మీడియా ను మ్యానేజ్ చేయడానికి, దానితో పాటు తన ఫిట్ నెస్ సెంటర్ కు అనువుగా ఉండేలా “వన్ షాట్ ఎట్ టూ బర్డ్స్” అన్నట్లుగా బహుముఖ వ్యూహంతో ఈ కొణిదెల వారి కోడలు ప్రోత్సాహంతో రామ్ చరణ్ ముంబాయ్ లో ఇల్లు కొన్నాడని అంటున్నారు.

 అందుకే కాబోలు ప్రస్తుతం యంగ్ హీరోలు అల్లు అర్జున్,జూనియర్ ఎన్టిఆర్, గోపి చంద్ లు వ్యాపార నేపధ్యం గల కుటుంబాల నుండి తమ భార్యలను ఎంచుకుంటున్నారు. అటు సినిమాలు ఇటు వ్యాపారాలతో మన యంగ్ హీరోల జీవితాలు సంపాదనే సంపాదన గా నిండిపోతున్నాయి. మొత్తం మీద ఉపాసన ఐడియా ముంబాయ్ లో చెర్రీ జీవితానికి ఎంత వరకు పునాది అవుతుందో చూడాలి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: