ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రుతి హాసన్ హవా నడుస్తోంది. రామ్ చరణ్, ఎన్టిఆర్, అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోల సినిమాలలో శ్రుతి యే హీరోయిన్. నటుడిగా కమల్ హాసన్ స్థాయి ఏమిటి.. అన్నది అందరికి తెలిసిందే. ఆ తండ్రి కి తగ్గ కూతురిగా శ్రుతి కూడా తన సినిమాల విషయంలో చక్కటి కమిట్మెంట్ తో ప్లాండ్ గా వ్యవహరిస్తోంది అని టాలీవుడ్ టాక్. ఈమధ్య న శ్రుతి హాసన్ అటు ఎన్టిఆర్ “రామయ్య వస్తావయ్యా” ఇటు చెర్రీ “ఎవడు” సినిమాలలో ఒకే రోజు రెండు షెడ్యుల్స్ లో పని చేసి తన కమిట్మెంట్ ఏమిటో చూపెట్టింది.

అటువంటి శ్రుతి బాలీవుడ్ లో “డీ డే” సినిమాలో వేశ్యగా డి-గ్లామర్ పాత్రలో నటిస్తోందన్న విషయం తెలిసిందే. నటనలో శ్రుతి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేయడంలో ఎటువంటి మొహమాటం పడకుండా పక్కా ప్రోఫసనల్ హీరోయిన్ గా వ్యవహరిస్తోంది. స్వతహాగా గాయని అయిన శ్రుతి చేత “డీ డే” సినిమాలో ఓ పాట పాడించాలని నిర్మాత నిఖిల్ అద్వాని భావించాడట. ఈ విషయానికి మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ ఎహసాన్ లాయ్ కూడా అంగీకరించడం తో పాట రికార్డింగ్ కు ముంబాయ్ లో అంతా సిద్ధం చేశారట. అయితే రికార్డింగ్ జరగవలసిన రోజు ఉదయానికి శ్రుతి తీవ్ర జ్వరంలో బాధపడుతూ ఉంటే రికార్డింగ్ వాయిదా వేద్దామని సంగీత దర్శకుడు సూచించినా ఆ మాట వినకుండా అంత బాధలోనూ టాబ్లెట్స్ మింగుతూ కేవలం అరగంటలో పాటపాడి ఒకే చేసేసిందట.

 ఈ కమిట్మెంట్ ను చూసిన దర్శకనిర్మాతలు ఆశ్చర్యపోయారట. ఇంత కమిట్మెంట్ ఉంది కాబట్టే ప్రస్తుతం శ్రుతి హాసన్ హవా ముందు చాలామంది గ్లామరస్ హీరోయిన్స్ నిలబడలేక కోలీవుడ్, బాలీవుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. అటు గ్లామర్ ఇటు నటన, ఆపై అదృష్టం అన్ని కలిసి రావడంతో ప్రస్తుతం శ్రుతి హవా టాలీవుడ్, బాలీవుడ్ లలో నడుస్తోంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: