సూర్యని పవర్ఫుల్ పోలీస్ పాత్రలో చూపించిన చిత్రం యముడు. యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ సిద్ధమైంది. అది సింగంగా వస్తోంది. అనుష్క, హన్సిక కథానాయికలు. అంజలి ఓ హాట్ సాంగ్లో కనిపించనుంది. ఈ చిత్రాన్ని జులై 5న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.
తొలిభాగంలో కనిపించిన నటీనటుల్లో అందరూ ఈ సీక్వెల్లో నటించారు. దానితో పాటు కొత్త పాత్రలూ వచ్చి చేరాయి. ఈ సినిమాలో ఏకంగా నలుగురు విలన్లు ఉంటారట. సూర్య సినిమాలంటే... యాక్షన్ సీక్వెన్స్లు భారీగా ఉంటాయి. హరి కూడా యాక్షన్ సన్నివేశాలు తీర్చిదిద్దడంలో దిట్ట. ఈ సినిమాలో ఏకంగా ఏడు యాక్షన్ ఘట్టాలున్నాయట. దానితో పాటు భారీ ఛేజ్ కూడా ఉందట. నీటి అడుగున సూర్య చేసిన ఫైట్ ఆకట్టుకొంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
��
గత కొంతకాలంగా సూర్య బ్రదర్స్కి కాలం కలసి రావడం లేదు. వరుసగా అన్నీ ఫ్లాపులే చూస్తున్నారు. మరి ఈ సింగం అయినా వాళ్లను ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.