సుశాంత్ హీరోగా హిట్ కోసం ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన మూవీ అడ్డా. ఈ మూవీ ఆడియో లాంచ్ ప్రోగ్రాం ఇటీవలే జరిగింది. ఈ ఫంక్షనుకి అక్కినేని ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, సుమంత్ ఇలా అందరు హాజరయ్యారు. అయితే ఈ అడ్డాలో వీరు, ముఖ్యంగా నాగేశ్వర రావు అండ్ నాగార్జున మాట్లాడిన మాటలు, మాటల్లా లేదు సొంత డబ్బాలాగా ఉన్నాయ్.


అదెలా అంటే ముందుగా నాగేశ్వరరావు ఎప్పటిలానే తన కొంటె బుద్దిని ప్రదర్శించి హీరోయిన్లని టార్గెట్ చేస్తే, నాగ్ మాత్రం అల్లుడి అడ్డాను తన కొడుకుల డబ్బాగా మార్చేసాడు. అభిమానులని తెగ ఇబ్బంది పెడుతున్నామని చెబుతూనే, మొన్న నాగ చైతన్య ఫంక్షనుకి వచ్చారు, ఆలాగే నా ఫంక్షనుకి వచ్చారు, అటు తరువాత అఖిల్ ఆడియో ఫంక్షనుకి వస్తారు అంటూ అఖిల్ ఎంట్రీ గురించి అల్లుడి అడ్డాలో బయట పెట్టేసాడు.


అసలే హిట్లు లేక నానా పనులు చేస్తున్న సుశాంతుని కాస్త ఎక్కించాల్సింది పోయి నాగ్ ఇలా కొడుకుల గురించి మాట్లాడుతున్నప్పుడు పాపం సుశాంత్ ఫేస్ ఎలా ఉందంటే...అలా ఉందనుకోండి. ఆ ముఖాన్ని గమనించే నాగ్ టాపికుని తన సిస్టర్ పైకి ఫోకస్ చేశాడు...తన సిస్టర్ కళ్ళలో ఆనందం చూడాలని ఆరాటపడతానని చెప్పుకొచ్చాడు. ఇలా నాగ్ తన అల్లుడి అడ్డాని వాడేసుకున్నాడు కొడుకుల కోసం.

మరింత సమాచారం తెలుసుకోండి: