తెలుగు,తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎన్నో జానపద చిత్రాలు వచ్చాయి..కానీ ‘బాహుబలి’ లాంటి విజువల్ ఎఫెక్ట్ తో ఉన్న చిత్రం రాలేదు. ఇక ఈ చిత్రం షూటింగ్ మొదలు కలెక్షన్ల వరకు రాజమౌళి క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా ప్రమోషన్..సోషల్ మీడియాలో ప్రచారం ఇలా అన్ని రకాలు గా సినిమాపై అంచనాలు పెంచారు.
బాహుబలి రూ.600 కోట్ల కలెక్షన్లు వసూళ్లు చేయడమే కాకుండా..జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి 2’ చిత్రం షూటింగ్ లో నిమగ్నమయ్యారు. త్వరలో ఈ షూటింగ్ పూర్తి చేసుకొని అభిమానుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన ఓ వార్త బయటకు వచ్చింది. బాహుబలి 2 లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడన్నది వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి మొదటి పార్ట్ లో గెస్టు గా కన్నడ హీరో సుదీప్ గెస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే.
గతంలో బాహుబలి 2 లో తమిళ హీరో సూర్య గెస్ట్ గా నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు బాలీవుడ్కి చెందిన ఓ వెబ్సైట్ ఈ విషయాన్ని రాసుకొచ్చింది. అయితే ఇది మాత్రం హిందీ వర్షన్ లో మాత్రం అని కూడా రాశారు. అయితే ఈ విషయంపై బాహుబలి టీమ్గానీ షారూఖ్ గానీ అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు. కంక్లూజన్ కి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. కచ్చితంగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలన్నది జక్కన్న థాట్. రెండేళ్ల కిందట రిలీజైన బాహుబలి, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ సునామీ సృష్టించింది.