రాబోతున్న మూడు నెలలు మెగా కుటుంబ అభిమానులకు పండుగే. కేవలం మూడు నెలల వ్యవధిలో మెగా కుటుంబ హీరోల సినిమాలు మూడు వరసగా తెలుగు తెరపై కనిపించి, ప్రేక్షకులను ఆనంధపరచడమే కాకుండా దాదాపు 250 కోట్ల బిజినెస్ ను కూడా చెయ్యబోతున్నాయి. మొదటిగా జూలై చివరిలో విడుదల అవుతున్న రామ్ చరణ్ “ఎవడు” 60 కోట్ల బిజినెస్ చేస్తుందని అంటున్నారు.

ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ తో ఈ సినిమా క్రేజ్ బయ్యర్లలో బాగా పెరిగిందట. వచ్చే ఆదివారం విడుదల అవుతున్న ఈ సినిమా పాటలు హిట్ అయితే ఈ సినిమా 60 కోట్ల బిజినెస్ ధాటి పోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఈ సినిమా విడుదల అయిన కేవలం రెండు వారాల గ్యాప్ తో వస్తున్న పవన్ “అత్తారింటికి దారేది” కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకుండా ఇప్పటికే 70 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. ఫస్ట్ లుక్, ఆడియో ఈ రెండూ విడుదల అయ్యాకా ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిపోతుంది అని కూడా అంటున్నారు. ఈ రెండు సినిమాల తరువాత ఒక నెల గ్యాప్ తీసుకొని వచ్చే “జంజీర్” బాలీవుడ్, టాలీవుడ్ లలో 120 కోట్ల బిజినెస్ చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇవన్నీ కలిపి చూస్తూ ఉంటే కేవలం ఈ రెండు సినిమాల పైనే 250 కోట్ల బిజినెస్ జరగడం బట్టి టాలీవుడ్ సినిమాలో మెగా కుటుంబ హీరోల స్టామినా ను తెలియజేస్తోంది అంటారు.

ఈ మూడు సినిమాల ఫలితం ఎలా ఉన్నా, బిజినెస్ రిత్యా నిర్మాతలు సేఫర్ సైడ్ లో ఉన్నారని, అదే విధంగా ఈ మూడు సినిమాలకు కూడా టాలీవుడ్ లో కనీవినీ ఎరుగని ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నారు. ఈ పరిస్థితులను బట్టి రాబోతున్న మూడు నెలల కాలం మెగా కుటుంబ హీరోల అభిమానులకు పండుగే పండుగ అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: