తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు వచ్చారు.  అయితే ఎవ్వరికి ఎవరూ పోటీ లేకుండా ఎవరి టాలెంట్ వారిదే అన్నట్లు తమ సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప స్థానం సంపాదించారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  చిరు తనయుడు రాంచరణ్, అల్లుడు అల్లు అర్జున్ ఇప్పటికే టాప్ హీరోల లీస్టు లో చేరిపోయారు. ఇక తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చి రికార్డుల మోత మోగించారు.  
Image result for megafamily
చిరు అప్పటికీ..ఇప్పటికీ నెంబర్ వన్ హీరో అనిపించుకున్నారు.   మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా వచ్చిన సాయిధరమ్ తేజ, వరుణ్ తేజలు కూడా మంచి హిట్స్ తో ముందుకు దూసుకు వెళ్తున్నారు.  మెగా ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి సారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కొణిదెల నిహారిక.  మెగాబ్రదర్ అయిన నాగబాబు ముద్దుల కూతురు..వరుణ్ తేజకు చెల్లెలు అయిన నిహారిక మొదట బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.  ఈ నేపథ్యంలో ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..కానీ ఆ సినిమా అంత సక్సెస్ సాధించలేకపోయింది.

 దీంతో చాలా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తన అదృష్టాన్ని తమిళంలో పరీక్షించుకోబోతుంది.   ఇన్నాళ్లు మౌనంగా ఇంట్లోనే ఉన్న నిహారిక ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ కావాలని మళ్ళీ ప్రయత్నాలు చేస్తోంది.  తమిళ్‌లో కథానాయకుడు విజరు సేతుపతి సరసన కథానాయికగా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది.
Image result for okamanasu
ఈ విషయాన్ని నిహారిక తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపింది. 'నా తర్వాత ప్రాజెక్టు తమిళంలో అని ప్రకటించడం సంతోషంగా ఉంది' అని పేర్కొంది నిహారిక.  అరుముగ కుమార్ అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటిస్తోంది నిహారిక. మరి మెగా అమ్మాయి తమిళంలోనైనా హిట్ కొడుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: