నందమూరి బాలకృష్ణతో శాతకర్ణి సినిమా తీసి సత్తా చాటిన క్రిష్ ఇప్పుడు తన తర్వాత సినిమాల మీద కసరత్తులు చేస్తున్నాడు. అసలైతే విక్టరీ వెంకటేష్ తో వీరయ్య సినిమా చేయాల్సిన క్రిష్ అది అటకెక్కడంతో ఇప్పుడు కుర్ర హీరోలతో ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేశాడట. క్రిష్ ఇప్పటికే వేదంలో అల్లు అర్జున్, మంచు మనోజ్ లను కలిపి సినిమా తీశాడు.
 
ఇక ఇప్పుడు అదే తరహాలో మరో సినిమా చేస్తున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటిస్తారట. క్రిష్ ఇప్పటికే వారితో సంప్రదింపులు చేస్తున్నాడని తెలుస్తుంది. దర్శకుడిగా శభాష్ అనిపించుకుంటున్నా కమర్షియల్ గా క్రిష్ సక్సెస్ కాలేదు. కాని శాతకర్ణి ప్రాజెక్ట్ తో ఇప్పుడు అందరి కళ్లు క్రిష్ మీదే ఉన్నాయి.
 
తాను ఏం చేసినా అందులో విషయం ఉంటుంది అని గుర్తించేలా చేసుకున్న క్రిష్ మరి చేయబోయే సినిమాకు ఎవరెవరిని సెలెక్ట్ చేస్తాడో చూడాలి. అంతకుముందు శ్రీకృష్ణదేవరాయలు, గౌతమ బుద్ధుడు కథలను తీస్తానన్న క్రిష్ ఎందుకో ప్రస్తుతం సేఫ్ ప్రాజెక్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాడు. మరి క్రిష్ చేసే ఈ సరికొత్త మల్టీస్టారర్ మూవీ ఎలా ఉండబోతుందో అందులో ఎవరు నటిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: