టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా మహేష్–మురుగదాస్ ల కాంబినేషన్ ఫిల్మ్. మహేష్- మురుగదాస్ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో హైప్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. మహేష్ చేసిన ‘బ్రహ్మోత్సవం’ నిరాశపరచడంతో అభిమానులంతా మురుగదాస్ కాంబినేషన్ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ని పెట్టుకున్నారు.

అందుకే ఈ చిత్రాన్ని మహేష్ బాబు చాలా జాగ్రత్తతో చేస్తున్నారు. కథ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా మహేష్ బాబు ఈ మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయంలో ఫైర్ అయిన మురుగదాస్ ని హీరో మహేష్ బాబు ఎంత బుజ్జగించినప్పటికీ ఏ మాత్రం తగ్గటం లేదంట. వీటి వివరాలను చూస్తే…దర్శకుడు మురుగదాస్ మహేష్ సినిమాని హై స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఏమై ఉంటుందా? అనేది ఎప్పటి నుండో ప్రేక్షకుల్లో ఉన్న ప్రశ్న. ఇప్పటి వరకూ పెద్దగా మూవీకి సంబంధించిన న్యూస్ లు ఏవీ బయటకు రాలేదు. అందుకే అందరూ మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ మూవీపై తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రం టైటిల్ బయటకు రాలేదు. కానీ తాజాగా ధరమ్ తేజ్ ‘విన్నర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిధిగా విచ్చేసిన నిర్మాత పివిపి ఆ చిత్ర ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గురించి మాట్లాడుతూ ‘ఠాగూర్ మధు ఈ ఏడాది మిస్టర్, విన్నర్, సంభవామి యుగే యుగే అనే మూడు సినిమాలు చేస్తున్నారు.

అన్నీ విజయవంతమవ్వాలి’ అన్నారు. ఠాగూర్ మధు కూడా మహేష్ సినిమా నిర్మాతల్లో ఒకరు కావడం, పివిపి చెప్పిన టైటిల్ మొదటి నుండి ప్రచారంలో ఉండటంతో మహేష్ చేస్తున్న సినిమా టైటిల్ ‘సంభవామి యుగే యుగే’ అని తేలిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మురుగదాస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతే కాకుండా పివిపై ఫైర్ అవుతున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలని మురుగదాస్ కి మహేష్ బాబు ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదని చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న టాక్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: