‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఘన విజయం తరువాత బాలకృష్ణ నటించబోయే లేటెస్ట్ సినిమాకు సంబంధించి నిన్న అధికారికమైన క్లారిటీ పూరి నోటివెంట వచ్చింది. ‘రాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌. బాలకృష్ణ హీరోగా భవ్య క్రియేషన్స్‌ ఆనంద్‌ప్రసాద్‌గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను' అంటూ మహాశివరాత్రి సందర్భంగా పూరి తన ఆనందాన్ని బాలకృష్ణ అభిమానులతో తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. 

ఇప్పటికే మహేష్ వెంకటేష్ లు తిరస్కరించిన ‘జన గణ మన’ కథ కొద్ది మార్పులతో బాలకృష్ణకు  సినిమాగా మారబోతోంది. ఈమూవీ ప్రస్తుత సామజిక రాజకీయ పరిస్థుతుల నేపధ్యంలో ఉంటూ బాలకృష్ణ ఇమేజ్ ని పెంచే సినిమాగా మార్చబోతున్నాడు పూరి. 

ఈమూవీలో ముగ్గురు హీరోయిన్స్ బాలకృష్ణ పక్కన నటించబోతున్నారని టాక్. మార్చి 9న మొదలు పెట్టి అత్యంత వేగంగా సినిమాను పూర్తిచేసి సెప్టెంబర్ 29న దసరాను టార్గెట్ చేస్తూ విడుదల చేయడానికి పూరి ఈమూవీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడ ప్రకటించాడు. 

అయితే ఈవిషయాలే ప్రస్తుతం బాలకృష్ణ అభిమానులను టార్చర్ పెడుతున్నట్లు టాక్. ప్రస్తుతం దర్శకుడుగా పూరి ట్రాక్ ఏమాత్రం బాగుండలేదు. వరస పరాజయాలతో సతమతమైపోతున్న పూరి జగన్నాథ్ ప్రయోగాలలో బాలకృష్ణ చిక్కుకోవడం బాలయ్య అభిమానులకు ఏమాత్రం మనస్కరించడం లేదు అని టాక్.

అయితే పూరి మాత్రం బాలయ్య లుక్ ను డిఫరెంట్ గా చూపెడుతూ తన వెరైటీ పంచ్ డైలాగ్స్ ను బాలకృష్ణ నోటి వెంట చెప్పించి ఈసారి ‘పోకిరి’ రేంజ్ హిట్ ను బాలయ్య ద్వారా అందుకోవాలని పూరి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం.  దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ తో పూరి బాలయ్యతో చేయబోతున్న ఈ ప్రయోగం పూరి కెరియర్ కు సంబంధించి చాల కీలకం..   



మరింత సమాచారం తెలుసుకోండి: