చిన్న చిన్న వ్యక్తుల మధ్య గొడవలు ఎంతకాలం ఉంటాయో తెలియదు కానీ…పెద్ద పెద్ద వాళ్ళ గొడవలు మాత్రం చాలా కాలం నిలిచి ఉంటాయి. వీళ్ళు ఎప్పుడూ ఎదురు ఎదురు నిలుచొని గొడవపడరు. సామాజిక మాధ్యమాల ద్వారా…బహిరంగ సభల ద్వారా వీరు గొడవపడుతుంటారు. ఆ విధంగానే తాజాగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్,అలాగే మెస్టార్ చిరంజీవిల మధ్య ఓ రసవత్తరమైన సన్నివేశం జరుగుతుంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…గతంలో చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉన్న రచయిత యండమూరి వీరేంద్రనాథ్…ఇప్పుడు చిరు పేరు చెబితే తనదైన భాషలో తిట్టడం మొదలు పెడుతున్నారు. గతంతో ఓ ప్రోగ్రామ్లో రామ్చరణ్ను ధూషిస్తూ యండమూరి చేసిన కామెంట్స్..కి మెగాహీరో నాగబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. దీంతో యండమూరి వీరేంద్రనాథ్ కి మైండ్ బ్లాంక్ అయింది. ఆ విషయంలో అందరూ యండమూరి వీరేంద్రనాథ్ ది తప్పుగా భావించారు. ఇక మెగాఫ్యామిలీ సైతం నాగబాబు కి సపోర్ట్ గా నిలిచి…ఎవరు మాత్రం ఈ విషయంలో ఊరుకుంటారు? అని కామెంట్స్ చేశారు.
ఓ ప్రముఖ టీవి ఛానల్ లోనూ చిరంజీవి కూడ యండమూరి వీరేంద్రనాథ్ పై గట్టిగానే కామెంట్ చేశారు. తనకి ఉన్న సంస్కారం ఆ సమయంలో ఎక్కడి పోయింది? అంటూ చిరు కామెంట్ చేశారు. అయితే యండమూరి వీరేంద్రనాథ్ సమయం చూసుకొని చిరుని తిట్టడానికి రెడీ అయ్యారు. తాజాగా యండమూరి వీరేంద్రనాథ్…చిరు నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్పై యండమూరి సంచలన కామెంట్స్ చేసిన సంగంతి తెలిసిందే. ‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ పేరుతో ఘోరమైన మోసం జరుగుతోంది. ఆ షోలో పాల్గొనాలంటే ముందుగా మూడు మెసేజ్లు పంపాలి. ఒక్కో మెసేజ్కు ఐదు రూపాయలు ఖర్చవుతుంది.
అంటే మూడు మెసేజ్లకు 15 రూపాయలు. పది లక్షల మంది మేసేజ్లు పంపితే దాదాపు కోటిన్నర రూపాయలు నిర్వాహకుల జేబులో పడతాయి. తర్వాత ఐదు, ఆరు లక్షలు కుక్కలకు విసిరినట్లు విసురుతారు. వాటినే చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నాం. ఇంతకంటే హీనం మరొకటి ఉండదు. చాలా పేదవాళ్లు కూడా ఇలాంటి వాటికి మెసేజ్లు పంపించి మోసపోతున్నారు. దీని కంటే లాటరీ టికెట్ కొనడం మేలు. లాటరీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం ఇలాంటి గ్యాంబ్లింగ్ ప్రోగ్రామ్లను కూడా బ్యాన్ చేయాల’ని యండమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామంట్స్ కి మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.