బాలీవుడ్ హాట్ బ్యూటీ దిషా పటాని మీడియా మీద అంత ఎత్తున ఎగిరి పడుతుంది. రీసెంట్ గా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో అమ్మడు చేసిన స్కిన్ షోకి ఫోటో గ్రాఫర్లు బాగా పని చెప్పారు. అమ్మడు అందాలన్ని బయట పెడుతున్న ఆ పిక్స్ తో పాటు ఆమెను తదేకంగా చూస్తున్న ఒకతని ఫోటో కూడా ట్రోలింగ్ అవుతుంది. అయితే మాకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎక్కడెక్కడ చూపించాలో బాగా తెలుసు దానికి ఇలా రచ్చ చేయడం ఏం బాలేదు అంటుంది దిషా. 


ఇండియన్ గాళ్స్ కు ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసని తమకెవరు ఉపోద్గాతం చేయాల్సిన అవసరం లేదని అంటుంది. అంతేకాదు తాను ఇలానే తనకు ఇష్టమొచ్చిన డ్రెస్సులు వేసుకుంటా కాని మీరు మాత్రం చూడకండి అంటుంది. మరి అమ్మడు చూడొద్దు అంటూ చూడమని హింట్ ఇస్తుందా లేక నిజంగానే తన ప్యాషన్ కోసమే ఇలాంటి కాస్టూంస్ వేసుకుంటున్నా కాబట్టి చూసినా చూడకపోయినా తనకు ఒరిగేమి లేదని చెబుతుందా అర్ధం కావట్లేదు.


బీ టౌన్ లో జాకీవ్ ష్రాఫ్ ప్రియురాలిగా బాగా ఫేమస్ అయిన దిషా తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పూరి కాంబినేషన్ లో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. సినిమా సరిగా ఆడకపోవడంతో అమ్మడు మళ్లీ బాలీవుడ్ బాటే పట్టింది. మరి ఈ రేంజ్ అందాలతో ఆడియెన్స్ తో పాటు దర్శక నిర్మాతల అటెన్షన్ ను ఏర్పరచుకుంటున్న దిషా త్వరలోనే క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: