స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టడం మాములే.. సరైనోడుతో తన స్టామినా రేంజ్ ఏంటో చూపించిన అల్లు అర్జున్ ఈసారి దువ్వాడ జగన్నాథంగా రాబోతున్నాడు. హరీష్ శంకర్ డైరక్షన్ లో రాబోతున్న డిజె మూవీ దిల్ రాజు నిర్మిస్తుండగా పూజ హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత బన్ని అసలైతే తమిళ దర్శకుడి లింగుస్వామితో ఓ సినిమా చేయాల్సి ఉంది.


మధ్యలో వక్కంతం వంశీ కథ చెప్పగా అతనితో సినిమా ఫిక్స్ అయ్యాడు బన్ని. అది కాక తమిళంలో ఫ్లాపుల్లో ఉన్న లింగుస్వామితో ఇప్పుడు రిస్క్ ఎందుకు అని ఈ ప్లాన్ చేసారట. బన్ని కాదనుకున్నా సరే లింగుస్వామి మాత్రం అసలు అల్లు అర్జున్ అవకాశాన్ని వదులుకునేలా లేడట. ఒక్క అవకాశం ఇస్తే తన టాలెంట్ చూపిస్తా అని చెప్పాడట. 


కథ ఆల్రెడీ ఫైనల్ అవగా సినిమా విషయంలో కాస్త ఆలోచిస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే వక్కంతం వంశీ సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని టైటిల్ పెట్టి కాంబినేషన్ మీద క్యూరియాసిటీని పెంచాడు. మరి వంశీతో ఆపేసి లింగుస్వామితో చేస్తాడా లేక రెండు సినిమాలను ఓకే అని పార్లర్ గా చేస్తాడా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: