చెప్పను బ్రదర్ కాంట్రవర్సీతో మొదలైన పవన్ అల్లు అర్జున్ ల అభిమానుల వార్ రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. లేటెస్ట్ గా విడుదలైన బన్నీ ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ విషయంలో ఈ వార్ మరొకసారి బయటకు వచ్చి అల్లుఅర్జున్ ను ద్వేషిస్తున్న ఒక వర్గం రోజురోజుకీ పెరిగి పోతోంది అన్న సంకేతాలను ఇస్తోంది. ఈ టీజర్ యూట్యూబ్ లో విడుదలై కనీసం మూడు రోజులు కూడ కాకుండానే ఈ టీజర్ ను డిస్ లైక్ చేస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
సాధారణంగా టాప్ హీరోల సినిమాలకు యాంటీ ఫాన్స్ నుంచి డిస్ లైక్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇలా వేలసంఖ్యలో ఒక ఉప్పెనలా వచ్చి పడుతూ ఉండటం వెనుక పవన్ అభిమానుల వ్యూహం ఉంది అని అల్లుఅర్జున్ అభిమానులు మధన పడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా అల్లు శిరీష్ వల్ల ఈ అఘాతం మరింత పెరిగిందని అంటున్నారు.
శిరీష్ తన ట్విట్టర్లో సాయిధరమ్ తేజ్ని, పవన్కళ్యాణ్ని అన్ ఫాలో అవడం గమనించిన పవన్ వీరాభిమానులు శిరీష్ పై విపరీతమైన కోపంగా ఉన్నారని టాక్. అదేవిధంగా పవన్ని ఏకవచనంలో సంభోదిస్తూ అల్లు శిరీష్ చేసిన ప్రైవేట్ సంభాషణలు కూడా వెలుగులోకి వచ్చాయి అని అంటున్నారు.
అయితే ఇవి ఎవరో క్రియేట్ చేసినవి అని చేసినవని కావాలని అల్లు వారికి పవన్తో విబేధాలున్నట్టుగా సృష్టించడానికి ఇంత కథను క్రియేట్ చేస్తున్నట్లుగా ఉందని శిరీష్ తన సన్నిహితుల వద్ద గగ్గోలు పెడుతున్నట్లు టాక్. అయితే ఇప్పటికే సెన్సిటివ్గా ఉన్న పవన్ బన్నీల మధ్య సాన్నిహిత్యం ఇలాంటి రూమర్స్ వల్ల మరింత దూరం జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు.
‘దువ్వాడజగన్నాథం’ టీజర్ రిలీజ్ విషయంలోనే ఇంత రచ్చ జరుగుతూ ఉంటే ఈ మూవీ విడుదల అయ్యాక కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే వ్యక్తుల సంఖ్య కూడ బాగా పెరిగే ఆస్కారం ఉందని ఈ విషయాల పై బన్నీ ఒక సరైన ఎత్తుగడ వెయ్యకపోతే ఈ వివాదాలు మరింత ముదిరి జగన్నాథానికి మరింత హాని కలిగించడం ఖాయం అని ఫిలింనగర్ లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు..