టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో వారి సినిమాలలో ఉండే ప్రతీచిన్న సన్నివేశంలో వచ్చే ప్రతి డైలాగ్ విషయంలోనూ అనేక కోణాలలో రంద్రాన్వేషణ జరుగుతూనే ఉంది.  ఈ రంద్రాన్వేషణ మరింత శృతిమించి హీరోల అభిమానుల మధ్య వార్ గా మారుతోంది. 

ఇప్పటికే పవన్ బన్నీ అభిమానుల మధ్య దూరం పెరిగిన నేపధ్యంలో ఈసారి మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన విన్నర్ సినిమాలో అల్లుఅర్జున్ పై సెటైర్లు వేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. మొన్న శుక్రవారం రిలీజైన ‘విన్నర్’ సినిమాలో రెండు చోట్ల పరోక్షంగా అల్లు అర్జున్ మీద సెటైర్లు ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

ఈ సినిమా కథ గుర్రపు పందేల నేపథ్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఒక చోట గుర్రాన్ని చూపెట్టి భయపెడితే ‘‘అది రేసుగుర్రం అయితే మా వాడు దాన్ని స్వారీ చేస్తాడు’’ అనే డైలాగ్ వినిపిస్తుంది. ‘రేసుగుర్రం’ అన్నది బన్నీ టైటిల్ అన్న సంగతి తెలిసిందే. ఇది ఉద్దేశపూర్వకంగా అల్లుఅర్జున్ ను టార్గెట్ చేస్తూ తేజ్ వేసిన సెటైర్లు అని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. 

ఇదే సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరొక చోట తనకు తెలుగు భాషలో నచ్చని సినిమాలు రెండే రెండు అంటూ ‘రేసుగుర్రం’, ‘నాన్నకు ప్రేమతో’ పేర్లు చెబుతాడు. 
సినిమాలో సందర్భానుసారం ఆ డైలాగ్ ఓకే అనిపిస్తుంది కానీ ఇక్కడ కూడా బన్నీని  ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తూ తేజ్ ఈ సైటైర్ వేశారన్న డిస్కషన్ నడుస్తోంది. దీనితో అల్లు అర్జున్ అభిమానులు సాయి ధరమ్ తేజ్ పై కూడ బాగా అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈమూవీకి ఎవరేజ్ టాక్ వచ్చినా ఈసినిమాకు వస్తున్న కలక్షన్స్ ను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈమూవీకి మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల షేర్ రావడం తేజ్ స్టామినాను సూచిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇవ్వాళతో ముగిసి పోతున్న ఈవారాంతానికి ఈసినిమాకు 15కోట్ల వరకు షేర్ రావడం ఖాయం అని అంటున్నారు. దీనితో ఈ మెగా యంగ్ హీరో తన సినిమా టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: