అక్కినేని అఖిల్ శ్రీయా భూపాల్ ల ఎంగేజ్మెంట్ డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. మార్చ్ లో పెళ్లి పీటలెక్కాల్సిన ఈ వధువరులు ఇప్పుడు ఒకరంటే ఒకరు పడట్లేదని పెళ్లి కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసిందే. మీడియా మొత్తం కోడై కూస్తున్నా ఈ విషయం పట్ల అటు నాగార్జున కాని.. జివికె ఫ్యామిలీ కాని అడ్డు చెప్పక పోవడంతో ఈ న్యూస్ కన్ఫాం అనేస్తున్నారు.    


సాధారణంగా తన సినిమా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తేనే డౌట్ క్లియర్ చేసి క్లారిటీ ఇచ్చే నాగ్ ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడు అన్నది కొందరి ప్రశ్న. అయితే దానికి కారణం లేకపోలేదట.. మళ్లీ ఇద్దరు మనసు మార్చుకుని సరే అనే పరిస్థితుల కోసం నాగార్జున చూస్తున్నారట. ఇప్పటికే చెప్పాల్సినవన్ని అఖిల్ కు చెప్పి ఇక తర్వాత నీ ఇష్టం అనేశాడట నాగార్జున.   


ముందునుండి అఖిల్ పెళ్లి ఇంత చిన్న వయసులోనే ఎందుకని నాగార్జునను అందరు అడగడం దానికి నాగ్ వాడి ఇష్టం అని చెప్పడం చూస్తూనే ఉన్నాం. మరి ఫైనల్ గా నాగ్ వెయిట్ చేస్తున్నట్టుగా అఖిల్ శ్రీయాల మధ్య సంధి కుదురుతుందా.. జరిగిన ఎంగేజ్మెంట్ కూడా తెగదెంపులే అంటారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.   



మరింత సమాచారం తెలుసుకోండి: