గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ ఇది. ఆయన స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
రుద్రమదేవిలో వీలైనన్ని స్పెషల్ ఎట్రాక్షన్లు ఉండాలనేది గుణశేఖర్ ఆలోచన. అటు సాంకేతికంగా, ఇటు నటీనటుల పరంగా పేరున్నవారినే ఎంచుకొంటున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఓ వీరుడి పాత్ర వచ్చి చేరింది. దాదాపు పది నిమిషాల పాటు సాగే ఆ పాత్ర కోసం ఓ అగ్ర హీరో పేరుని పరిశీలిస్తున్నారని చెప్పుకొన్నారు. ఆ హీరో ఎవరో కాదు.. మహేష్ బాబు.
��
ఒక్కడు సినిమాతో మహేష్ స్టామినాని మరో రూపంలో చూపించాడు గుణశేఖర్. అర్జున్ ఆర్థికంగా లాభాలు తీసుకురాకపోయినా అందులో మహేష్ నటనకు మరోసారి నంది వచ్చింది. ఒక దర్శకుడితో మహేష్ మూడు సినిమాలు చేశాడంటే.. అది గుణశేఖర్తోనే. వీరిద్దరికీ మంచి ర్యాపో ఉంది. ఆ స్నేహంతోనే గెస్ట్ ఎప్పీరియన్స్ కోసం మహేష్ బాబుని సంప్రదించాడు గుణశేఖర్. అయితే ఇప్పటి వరకూ మహేష్ నుంచి సానుకూల స్పందన రాలేదు. వన్ షూటింగ్ కోసం.. లండన్లో ఉన్న మహేష్ ఇండియా తిరిగొచ్చాక తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడట. ఒకవేళ మహేష్ ఈ సినిమాలో అతిథిగా కనిపించడానికి ఒప్పుకొంటే ఈ సినిమా రేంజు ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం.