ఏంటో.. ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో కొన్ని అద్భుతాలు జ‌రుగుతున్నాయి. మ‌ల్టీ స్టార‌ర్లు మొద‌లైపోతున్నాయి, అతిథి పాత్ర‌ల్లో అగ్ర హీరోలు క‌నిపిస్తున్నారు. స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వ‌డానికి ముందుకొస్తున్నారు. అలాంటి అద్భుతాల‌లో రుద్ర‌మ‌దేవి కూడా చేర‌బోతోంది.
గుణ‌శేఖ‌ర్ క‌ల‌ల ప్రాజెక్ట్ ఇది. ఆయ‌న స్వీయ ద‌ర్శ‌కత్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

రుద్ర‌మ‌దేవిలో వీలైన‌న్ని స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్లు ఉండాల‌నేది గుణ‌శేఖ‌ర్ ఆలోచ‌న‌. అటు సాంకేతికంగా, ఇటు న‌టీన‌టుల ప‌రంగా పేరున్న‌వారినే ఎంచుకొంటున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఓ వీరుడి పాత్ర వ‌చ్చి చేరింది. దాదాపు ప‌ది నిమిషాల పాటు సాగే ఆ పాత్ర కోసం ఓ అగ్ర హీరో పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పుకొన్నారు. ఆ హీరో ఎవ‌రో కాదు.. మ‌హేష్ బాబు.

��

ఒక్క‌డు సినిమాతో మ‌హేష్ స్టామినాని మ‌రో రూపంలో చూపించాడు గుణ‌శేఖ‌ర్‌. అర్జున్ ఆర్థికంగా లాభాలు తీసుకురాక‌పోయినా అందులో మ‌హేష్ న‌ట‌న‌కు మ‌రోసారి నంది వ‌చ్చింది. ఒక ద‌ర్శ‌కుడితో మ‌హేష్ మూడు సినిమాలు చేశాడంటే.. అది గుణ‌శేఖ‌ర్‌తోనే. వీరిద్ద‌రికీ మంచి ర్యాపో ఉంది. ఆ స్నేహంతోనే గెస్ట్ ఎప్పీరియన్స్ కోసం మ‌హేష్ బాబుని సంప్ర‌దించాడు గుణ‌శేఖ‌ర్‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ నుంచి సానుకూల స్పంద‌న రాలేదు. వ‌న్ షూటింగ్ కోసం.. లండ‌న్‌లో ఉన్న మ‌హేష్ ఇండియా తిరిగొచ్చాక త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాడ‌ట‌. ఒక‌వేళ మ‌హేష్ ఈ సినిమాలో అతిథిగా క‌నిపించ‌డానికి ఒప్పుకొంటే ఈ సినిమా రేంజు ఎక్క‌డికో వెళ్లిపోవ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: