ఒక సినిమా పూర్త‌వ్వ‌కుండానే మ‌రో సినిమా మొద‌లెట్టే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్నాడు మ‌హేష్‌బాబు. ప్ర‌స్తుతం వ‌న్  చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కి చేరింది. వెంట‌నే శ్రీనువైట్ల సినిమా ఆగ‌డు సెట్స్ పైకి వెళ్ల‌డానికి అన్ని స‌న్నాహాలు పూర్త‌య్యాయి. ఆగ‌స్టులో ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఆ నెల‌లోనే చిత్రీక‌ర‌ణ మొద‌లైపోతుంది.

ఆగ‌డు స్ర్కిప్టు ప‌నుల నిమిత్తం.. శ్రీ‌నువైట్ల ఊటీ వెళ్లాడు. అక్క‌డ త‌న ర‌చ‌యిత‌ల బృందంతో స్ర్కిప్టు ప‌క్క‌గా పూర్తి చేసుకొని వ‌చ్చాడు. వినోదం, యాక్ష‌న్ మేళ‌వించి దూకుడు రేంజులో ఈ స్ర్కిప్టుని తీర్చిదిద్దార‌ట‌. మ‌హేష్ క్యారెక్ట‌ర్‌తో పాటు ఎమ్మెస్‌, బ్ర‌హ్మానందం పాత్ర‌లు మ‌రోసారి అద్భుతంగా పండాయ‌ని చిత్ర‌బృందం ధీమాగా చెబుతోంది.

��

అయితే క‌థానాయిక‌ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ నిర్ణ‌యానికి రాలేదు చిత్ర‌బృందం. లోక‌ల్ లాటెంట్ కంటే, బాలీవుడ్ అమ్మాయి అయితేనే బెట‌ర్ అనుకొంటున్నారు. శివం సినిమాకి సోనాక్షి ఫిక్స్ అయ్యింది. మ‌రి ఆగ‌డు కోసం ఎవ‌రిని తీసుకొస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: